రాజ్ భవన్ లో డైలాగ్ కింగ్: వాయింపుడు
ప్రముఖ నటుడు మోహన్ బాబు పియానో వాయించారు. అది కూడా, తమిళనాడు రాజ్ భవన్ లో, ఈ విషయాన్ని మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపింది.
ప్రముఖ నటుడు మోహన్ బాబు పియానో వాయించారు. అది కూడా, తమిళనాడు రాజ్ భవన్ లో! ఈ విషయాన్ని మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి ఈ పియానోను వాయించి తనలోని సంగీతకారుడిని తన తండ్రి బయట పెట్టారని పేర్కొన్న మంచు లక్ష్మీ, ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది.
ఏదో వ్యక్తిగత పని మీద తమిళనాడు వెళ్ళిన మోహన్ బాబు.. తమిళనాడు గవర్నర్ కార్యాలయంలో ఉన్న ఓ పాత పియానోపై తన ప్రావీణ్యం ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఫాదర్స్ డే సందర్భంగా ఆయన కుమార్తె మంచు లక్ష్మి తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేసింది.నాన్న బ్రిటీష్ కాలం నాటి పియానోను వాయిస్తూ.. తనలోని సంగీత విధ్వాంసుడుని బయటపెట్టారు' అంటూ తండ్రిలో ఉన్న కళాకారున్ని మనకు పరిచయం చేసింది...


Click it and Unblock the Notifications











