Don't Miss!
- News ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సంగీత స్వరం మూగబోయింది: విశ్వనాథన్ కన్నుమూత
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
1928వ సంవత్సరం జూన్ 24న కేరళలోని పాలక్కాడ్ సమీపంలోని ఇలప్పులలో ఆయన జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. సీఆర్ సుబ్బరామన్తో కలిసి దేవదాసు, లైలామజ్నూ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. దేవదాసు సినిమాలోని జగమే మాయ బతుకే మాయ పాటను స్వరపర్చారు.
చండీరాణి, సిపాయి చెన్నయ్య తదితర చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఈయన మృతి వార్త విని సినీ ప్రపంచం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. :ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ మృతిపై సినీరంగం నటీనటులు, సంగీత విద్వాంసులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
తెలుగు, తమిళ, మళయాల భాషల్లో 1200 చిత్రాలకు ఎంఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించారు. సిపాయి చిన్నయ్య, ఇంటికి దీపం ఇల్లాలే, మరో చరిత్ర, అంతులేని కథ, అందమైన అనుభవం, తెనాలి రామకృష్ణుడు, ఆకలిరాజ్యం, ఇది కథకాదు, రాము, సింహబలుడు తదితర చిత్రాలకు ఎంఎస్ సంగీత దర్శకత్వం వహించారు.