మా అమ్మ ఇప్పుడు కూతురైంది.. సమంతను చూసి మురిసిపోయిన నాగార్జున
కాబోయే కోడలు సమంత, తన కుమారుడు నాగచైతన్యను నిశ్చితార్థ వేదికపై చూసుకొని నాగార్జున అక్కినేని మురిసిపోయారు. అమల, ఇద్దరు కుమారులు... కాబోయే కోడళ్లతో కలిసి ఓ ఫొటో తీయించుకొని ఆనందంతో పొంగిపోయారు.
మా అమ్మ ఇప్పుడు కూతురైందని మన్మధుడు అక్కినేని నాగార్జున అన్నారు. తన కాబోయే కోడలు సమంతను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొన్న 'మనం' చిత్రంలో నాగార్జునకు అమ్మగా నటించిన సంగతి తెలిసిందే.
నాగచైతన్య, సమంత వివాహం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వేడుకలో కాబోయే కోడల్ని, తన కుమారుడిని వేదికపై చూసుకొని నాగార్జున మురిసిపోయారు. అమల, ఇద్దరు కుమారులు... కాబోయే కోడళ్లతో కలిసి ఓ ఫొటో తీయించుకొని ఆనందంతో పొంగిపోయారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. 'నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేక పోతున్నా. మా అమ్మ ఇప్పుడు కూతురైంది. ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది' అంటూ ట్విట్టర్లో నాగార్జున స్పందించారు.
నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేక పోతున్నానని, మా అమ్మ ఇప్పుడు కూతురైంది ఇంతకంటే సంతోషం ఇంకేముంటుందని నాగార్జున స్పందించారు.


Click it and Unblock the Notifications











