హీరో నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అవుతన్నాడు. పోకిరితో తెలుగు సినీ రికార్డులు తిరగ రాసిన పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు ముమ్మరమయ్యాయి. పూరి చిరుతతో రామ్ చరణ్ తేజను సేఫ్ గా లాంచ్ చేయటంతో ఆయనికే ఈ ప్రాజెక్టు అప్పచెప్పారట. కాగా ఈ చిత్రానికి 'ఫేమ్' అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడీగా జతకట్టే హీరోయిన్ పాత్రకు అతని బాడీ లాంగ్వేజ్ కి తగినట్లు ఉండే అమ్మాయిని ఎంపిక చేయటానికి కసరత్తు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబరు నెలలో అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రారంభం చేస్తారట.
Story first published: Friday, July 17, 2026, 0:23 [IST]