Don't Miss!
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
తొలిసారి రాయలసీమ యాసలో నాగార్జున డైలాగ్స్
మొన్న కింగ్ చిత్రంలో తెలంగాణా స్లాంగ్ లో మాట్లాడి అలరించిన నాగార్జున తాజాగా రాయలసీమ మాండలీకంలో మాట్లాడటానికి సమాయుత్తమవుతున్నట్లు సమాచారం. బిందాస్ చిత్రంతో దర్శకుడుగా మారిన వీరూ పోట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నాగార్జున ఈ శ్లాంగ్ తో రాసిన డైలాగులు చెప్పబోతున్నారు. ఇక ఈ చిత్రం ఓ మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఈ విషయం గురించి నాగార్జున స్వయంగా చెపుతూ...ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతాం. అలాగే తొలిసారిగా రాయలసీమ శ్లాంగ్ ని ఈ చిత్రంలో నేను మాట్లాడబోతున్నాను. ఇక ఈ చిత్రాన్ని కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అనుష్క, ప్రియమణి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇక గతంలో నాగార్జున సంతోషం చిత్రానికి వీరుపోట్ల మూల కథ అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. అలాగే వీరూ పోట్ల గతంలో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలకు కథను, సంతోషం, మనసంతా నువ్వే చిత్రానికి మూల కథను అందించారు.