Don't Miss!
- News ఈసారి మోడీ వేవ్ లేదు.. తేల్చేసిన బీజేపీ మహిళా ఎంపీ అభ్యర్ధి నవనీత్ కౌర్..!
- Lifestyle Egg Dum Biryani : గుడ్డుతో రుచికరమైన దమ్ బిర్యానీ..ఒకసారి రుచి చూస్తే మొత్తం మీరే లాగించేస్తారు
- Sports విరాట్ కోహ్లీనే నాకు స్ఫూర్తి: యూపీఎస్సీ టాపర్ అనన్య వీడియో
- Finance Election Rules: దేశంలో ఎలక్షన్ కోడ్.. ఎంత క్యాష్ తీసుకెళ్లొచ్చు.. ఈసీ రూల్స్ ఇవే..
- Automobiles మార్కెట్లో లాంచ్ అయిన రూ.17.70 లక్షల బైక్ ఇదే!.. పూర్తి వివరాలు
- Technology Haier నుంచి నాలుగు కొత్త స్మార్ట్ టీవీలు! ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
ఉషారు వచ్చింది..'ఊపిరి' ఆడియో డేట్ ఇచ్చారు
హైదరాబాద్ : తమ సినిమాలో చేస్తున్న హీరో హిట్ కొడితే ఆ నిర్మాతలకు వచ్చే ఆనందమే వేరు. ఎందుకంటే ఆ హిట్ ప్రభావంతో తమ చిత్రాలకు బిజినెస్ అవుతుంది. నాగార్జున రీసెంట్ గా సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయన' తో సూపర్ హిట్ ఇచ్చారు. దాంతో నాగార్జునతో ఊపిరి చిత్రం చేస్తున్న నిర్మాతలు ఊపరి పీల్చుకున్నారు. వెంటనే ఈ వేడిలోనే సినిమాని రిలీజ్ చేసేయాలనుకున్నారు. అందులో భాగంగా... గోపిసుందర్ స్వరపరిచిన పాటలు ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అనుష్క, శ్రేయ, అడవి శేష్ కీలక పాత్రల్లో కనపడనున్నారు. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చ్ 25న విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
నాగార్జున మాట్లాడుతూ... ''ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ వినలేదు. వంశీ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యా. మల్టీస్టారర్చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంద''న్నారు.
''నా సినిమాలన్నీ తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నాగార్జునగారితో తెర పంచుకోవడం ఆనందంగా ఉంద''ని కార్తి తెలిపారు.
''నాగార్జున, కార్తి ఈ సినిమా చేస్తామని ముందుకు రావడంతో సగం విజయం సాధించినంత ఆనందంగా ఉంది. నేను రాసుకొన్న పాత్రలకు వాళ్లయితేనే పూర్తిగా న్యాయం చేస్తారనిపించింద''న్నారు వంశీ పైడిపల్లి.
హాలీవుడ్కు చెందిన 'ది ఇంటచబుల్స్' సినిమాకు రీమేక్గా తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్, ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: శ్రీకర ప్రసాద్.