Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
హ్యాపీ న్యూ ఇయర్లో....హీరోయిన్ స్యాడ్ నిర్ణయం, ఇక విడాకులే!
న్యూఢిల్లీ: ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్ హ్యాపీ న్యూఇయర్ సంబరాలు ఇంకా ముగియక ముందే స్యాడ్ న్యూస్ చెప్పి అభిమానులకు షాకిచ్చింది. త్వరలో తన భర్త శుభోద్ మస్కారాతో విడిపోనున్నట్లు ప్రకటించింది.
నందితా దాస్-శుభోద్ మస్కారా ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి విహాన్ అనే ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. వీరి మధ్య రిలేషన్ కొంత కాలంగా సరిగా ఉండటం లేదని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ...'అవును నిజమే, త్వరలో విడిపోవాలని నిర్ణయించుకున్నాం, ఈ విషయంలో మీడియా వారు మా ప్రైవసీకి భంగం కలిగించ వద్దని ఆమె తెలిపారు.
'విడిపోవడం అంటే అంత ఈజీ కాదు, ముఖ్యంగా పిల్లలు ఉన్నపుడు మరింత క్లిష్టంగా ఉంటుంది. మాకు మా కుమారుడిని భవిష్యత్తు ముఖ్యం. విడిపోయినా కుమారుడి భవిష్యత్తుకు ఎలాంటి లోటూ లేకుండా చూడాలని నిర్ణయించుకున్నాం' అని తెలిపారు.
నందితా దాస్ వయసు 47 సంవత్సరాలు. 2002లో సౌమ్య సేన్ అనే వ్యక్తిని పెళ్లాడిన నందితా దాస్ 2007లో విడాకులు తీసుకున్నారు. 2010లో శుభోద్ మస్కారాను వివాహం చేసుకున్నారు. లీవుడ్లో ఫైర్, ఎర్త్, బవందర్ లాంటి మీనింగ్ ఫుల్ సినిమాల్లో నటించిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దర్శకత్వంలో వచ్చిన 'ఫిరాఖ్' మూవీ అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.