Don't Miss!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- News వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
న్యూస్ మేకర్ 2017: ఏం మాయ చేసిందో.. అక్కినేని ఇంటి కోడలిగా సమంత
దక్షిణాది సినీ పరిశ్రమలో అందం, అభినయంతో మెప్పించిన యువ హీరోయిన్లలో ఒకరు సమంత అక్కినేని. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేశావే చిత్రంలో అక్కినేని నాగచైతన్యతో జతకట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, మనం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తొలి చిత్రంలో నాగ చైతన్యతో నటించిన సమంత కొద్ది సంవత్సరాలు అఫైర్ కొనసాగించింది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పుడు అక్కినేని ఇంటి కోడలిగా మారింది.
Recommended Video
అక్కినేని నాగచైతన్యతో సమంత వివాహం 2017 అక్టోబర్ 6, 7 తేదీలలో గోవాలో నిరాడంబరంగా జరిగింది. నవంబర్ 12వ తేదీన హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో మ్యారేజ్ రిసెప్షన్ను అక్కినేని నాగార్జున చాలా గ్రాండ్గా నిర్వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు, దక్షిణాది సినీ పరిశ్రమలో వీరి వివాహం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.
నాగచైతన్యతో వివాహం తర్వాత నాగార్జునతో కలిసి రాజుగారి గది2 చిత్రంలో సమంత నటించింది. ప్రస్తుతం సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మహానటి చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నది. అలాగే కన్నడంలో ఘనవిజయం సాధించిన యూటర్న్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారే అవకాశం కూడా ఉందని వార్త వినిపిస్తున్నది. ఇలా అనేక సంచలన విషయాలతో సమంత 2017లో ఓ న్యూస్ మేకర్గా మారింది.