పవన్ కళ్యాణ్ ఉండరు, ఉన్నట్లే ఉంటుంది.. షాకింగ్ న్యూస్ చెప్పిన నితిన్!
నితిన్ నటించిన తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ. నితిన్ 25 చిత్రంగా రాబోతున్న ఛల్ మోహన్ రంగ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అ.. ఆ వంటి ఘనవిజయం తరువాత నితిన్ నటించిన లై చిత్రం నిరాశ పరిచింది. దీనితో తన 25 వ చిత్రం కోసం నితిన్ పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. ఛల్ మోహన్ రంగ చిత్రాన్ని నితిన్ అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకుడు కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ అందిస్తున్నారు.
ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా నితిన్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్నీ వెల్లడించాడు. ఈ చిత్రంలో నితిన్ పవన్ కళ్యాణ్ గెటప్ లో కనిపిస్తాడని వార్తలు వస్తుండడంతో నితిన్ దానిపై స్పందించాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఉండరు, కానీ ఉన్నట్లే ఉంటుంది అంటూ తెలిపి అభిమానులని సస్పెన్స్ లోకి నెట్టేశాడు. పలు చిత్రాల్లో నితిన్ పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే.



Click it and Unblock the Notifications











