Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
చిరంజీవి బాటలోనే యంగ్ టైగర్: అబిమానుల పై ఆపరేషన్ ఆకర్ష్
గత కొంత కాలం గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ఒడిదుడుకుల్లోనే సాగుతోంది. మంచి హిట్ లే వచ్చినా అవి ఎన్టీఆర్ రేంజ్ కాదు. నాన్నకు ప్రేమతో మంచి టాక్ రాబట్టుకున్నట్టే కానీ నందమూరి ఫ్యామిలీ లో వచ్చిన చీలిక కారణం గా అభిమానులు కూడా విడిపోవటం తో ఫాలోయింగ్ మునుపటంత స్ట్రాంగ్ గా లేదు.
ఈ విశయం ఎన్టీఆర్ కూడా ఈ మధ్యనే గమనించాడు. తనకంటూ ఉన్న ఫాలోయింగ్ నీ తన అభిమానులనీ పెంచుకోకపోతే తన కెరీర్కి గట్టి దెబ్బ ఎదురౌతుందని గ్రహించిన యంగ్ టైగర్ ఇప్పుడు ఫాలోయింగ్ ని పెంచుకునే పనిలో పడ్డాడు. నిజానికి నందమూరి ట్యాగ్ తోనే వచ్చినా ఇప్పుడు ఇక తనకంటూ ఒక ఇమేజ్ ఉండాక్లని కోరుకుంటున్నాడు... అందుకే అభిమానులకి దగ్గరయ్యే ప్రయత్నాలు ఎక్కువ చేసాడు...
సినిమా రిలీజయ్యాక ఏదో ఒకరిద్దరు అభిమానుల్ని కలిసే అలవాటున్న తారక్ ఇప్పుడు షూటింగ్ స్పాట్లో కూడా ఫాన్స్ని కలిసి వారితో ఫోటోలు దిగుతున్నాడు. దీని కోసం అతను రోజూ కొద్ది సమయం కేటాయిస్తున్నాడు. ఇది తెలుసుకున్న నందమూరి అభిమానులు మళ్లీ ఎన్టీఆర్కి చేరువ అవుతున్నారు.
ఎలాగైనా యంగ్ టైగర్ ని కలుసుకోవాలంటూ బారులు తీరుతున్నారు. గతంలో ఇలా తరచుగా ఫాన్స్ని కలుసుకుని తన ఫాన్ బేస్ని మరింత పెంచడానికి చిరంజీవి నిత్యం తపించేవారు. షూటింగ్ అయిపోయాక కూడా ఫాన్స్ కోసం గంట సమయం కేటాయించి అందరితో ఫోటోలు దిగేవారు.
ఇప్పుడు ఎన్టీఆర్ కూడా చిరంజీవిని ఫాలో అయిపోతూ ఫాన్స్ మనసులు దోచేస్తున్నాడు. ఈ మధ్యనే చెన్నై లో జనతా గ్యారేజ్ షూటింగ్ లోనే ఎన్టీఆర్ లో స్పష్టమైన మార్పు కనిపించింది. దాదాపు ఒకే రోజు లో మూడు గంతల పాటు అభిమానుల కోసం కేటాయించి. వారితో మాట్లాడుతూ, ఫొటోలు దిగుతూ గడిపాడు యంగ్ టైగర్...