నాన్నకు ప్రేమతో: మీడియాతో జూ.ఎన్టీఆర్ పర్సనల్ టచ్, భారీ పార్టీ
హైదరాబాద్: భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలో 'నాన్నకు ప్రేమతో' సినిమాతో ముందుకు వస్తున్నాడు. 'నాన్నకు ప్రేమతో' చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్కు 25వ సినిమా.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ విలేకరులను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. విలేకరులను ఆయన పర్సనల్గా మీట్ కానున్నారు. సోమవారం నాడు సాయంత్రం హైదరాబాదులోని దసపల్లా హోటల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీడియా మిత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడనున్నారు. వారికి మంచి పార్టీ కూడా ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.

మీడియా ప్రతినిధులతో జూనియర్ వ్యక్తిగతంగా కలిసేందుకు ఆసక్తి చూపించడం గమనార్హం. నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని సంక్రాంతి రోజు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో బాలకృష్ణ 'డిక్టేటర్', నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











