Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
70శాతం గట్టెక్కింది... నాగార్జున చాలానే కష్టపడుతున్నాడు.
పాండిచ్చేరిలో 20 రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్తో రాజుగారి గది 2 దాదాపు 70 శాతం టాకీ పార్ట్ పూర్తయింది
రెండేళ్ల క్రితం చిన్న సినిమాగా విడుదలై.. మంచి విజయాన్ని అందుకున్న చిత్రం 'రాజుగారి గది'.చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న 'రాజుగారి గది' చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న చిత్రం 'రాజుగారి గది 2'. ఒయాక్ ఎంటర్టైన్మెంట్స్, పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీ రోల్ లో కనిఒపించనున్నాడు.
ఒయాక్ ఎంటర్ టైన్మెంట్స్, పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమంత కీలకపాత్రను పోషిస్తున్న ఈ మూవీ తాజాగా థర్డ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. నాగార్జున, సీనియర్ నరేశ్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
''పాండిచ్చేరిలో 20 రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్తో దాదాపు 70 శాతం టాకీ పార్ట్ పూర్తయింది. నాగార్జున, నరేష్, సమంత, సీరత్ కపూర్, సీనియర్ నరేష్ల నడుమ కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ముఖ్యంగా నాగార్జున ఇందులో మరింత అందంగా కనిపిస్తున్నారని అందరూ వ్యాఖ్యానిస్తుండడం విశేషం. సీరత్ పాత్ర చాలా కీలకం, ఆమెకు లభించిన ఈ క్యారెక్టర్ ఆమె కెరీర్లో మైలురాయిగా నిలవడం ఖాయం'' అని చెప్తోంది చిత్ర యూనిట్
పాండిచ్చేరిలో 20 రోజులపాటు జరిపిన తాజా షెడ్యూల్తో ఈ మూవీ 70 శాతం వరకూ చిత్రీకరణ పూర్తయినట్టు నిర్మాతలు తెలియజేశారు. పాండిచ్చేరి షెడ్యూల్లో నాగార్జున, నరేశ్, సమంత, సీనియర్ నరేశ్ నడుమ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోన్న హీరోయిన్ సీరత్ కపూర్.కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుందని నిర్మాతలు ఆకాంక్షించారు. మరి.. 'రన్ రాజా రన్' తరహా మరో విజయాన్ని ఈ మూవీ సీరత్కు అందిస్తుందేమో చూడాలి..!