twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 'ఊసరివిల్లి'లో హైలెట్ డైలాగ్

    By Srikanya
    |

    జూ.ఎన్టీఆర్,సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఊసరివిల్లి చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో డైలాగులు అంటూ కొన్ని సర్కులేట్ అవుతున్నాయి.అవి..ఇది రంగులు మారే ఊసరవిల్లి కాదు..రాతలు మార్చే ఊసరవిల్లి, అలాగే కొడితే రంగులే కాదు రాతలు కూడా మారతాయి అంటూ డైలాగులు పంచ్ తో వస్తాయని తెలుస్తోంది.ఇక ఈ చిత్రం లో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది.ఆమె మతిపోగొట్టుకుని ఏదీ గుర్తు ఉండని పాత్రలో కనిపించనుంది.ఇక ఆమె కోసం ఆమె పగ తీర్చటం కోసం ఎన్టీఆర్ చేసే పోరాటమే ఊసరివిల్లి అంటున్నారు.ఇక బోయపాటి సినిమాను ప్రక్కన పెట్టి మరీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ప్రస్తుతం ఊసరివిల్లి చిత్రం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది.తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా మలుస్తున్నారు.

    English summary
    jr ntr's oosarvelli movie dialogue is circultaing on internet and creating much hype to the movie. "Edhi rangulu mare oosaravelli kaadhu raathalu marche oosaravelli" & "KODITHEY RANGULEY KADHU RAATHALU KUDA MARATHAI....".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X