ఫోర్స్ పనులను పవన్ ప్రకటిస్తాడా?
పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సి.ఎమ్.పి.ఎఫ్)ను ప్రారంభించి చాలా రోజులే అయింది. ప్రారంభం అయితే అయిందికానీ పనులేమీ మొదలుకాలేదు. ఈ సంస్థ చేయనున్న పనులను బహూషా వారంరోజుల్లో మీడియాకు తెలియజేయనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. సి.ఎమ్.పి.ఎఫ్ ను ప్రారంభించిన 40 రోజుల తరువాత దాని కార్యక్రమాలను ప్రకటిస్తానని ఆ రోజే పవన్ తెలిపాడు. చెప్పిన రోజులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో పవన్ ఏం చెప్పనున్నాడా అనే ఉత్కంఠ అభిమానులలో నెలకొన్నది. జల్సా షూటింగ్ తో బిజీగా ఉన్న పవన్ ఎపుడు తన సంస్థ కార్యక్రమాలను వెల్లడిస్తాడో మరి.


Click it and Unblock the Notifications











