డిపెరెంట్ గా ఎన్టీఆర్ గడ్డం, హెయిర్ ( కొత్త ఫొటోలు)
హైదరాబాద్ : ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు షూటింగ్ త్వరలో ప్రారంభమవుతోంది. ఈ మేరకు అందరికీ వీసా సమస్యలు తీరటంతో యూనిట్ అంతా కలిసి ...షూటింగ్ కు బయిలు దేరారు. వారితో పాటు ఎన్టీఆర్ కూడా బయిలు దేరాడు. ఎన్టీఆర్... సుకుమార్ కలిసి ఉన్న ఈ ఫొటోలు చూడండి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో..' అన్న టైటిల్ను పరిశీలిస్తున్నారట. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేసే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ‘అత్తారింటికి దారేది' లాంటి బ్లాక్బస్టర్ సినిమాను అందించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.
స్లైడ్ షోలో ... ఫొటోలు..

లండన్ వెళ్లటానికి కారణం..
ముఖ్యంగా సుకుమార్ గత చిత్రం 1,నేనొక్కిడినే గ్లోబల్ మార్కెట్ లోనే మనకు ఇక్కడ లోకల్ కన్నా ఎక్కవ కలెక్టు చేయటం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి ఓ కారణం అని చెప్తున్నారు.

హైలెట్..
అలాగే లండన్ లో ఓ తెలుగు చిత్రం లాంచింగ్ అనేది ఇప్పటివరకూ జరగలేదు కాబట్టి హైలెట్ గా నిలుస్తుంది...

అంతేకాకుండా....
లండన్ లో.. ఉండే మన తెలుగు వారికీ ఆనందం కలిగించినట్లు ఉంటుందని ఎన్టీఆర్ భావించి,గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెప్తున్నారు.

దీంతో ....
ఓవర్ సీస్ మార్కెట్ లో సైతం ఎన్టీఆర్ కు క్రేజ్ పెరిగే అవకాసం ఉంది.

విడుదల తేది
జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

హీరోయిన్ గా...
ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేయనుంది.

జగపతిబాబు.. కీలకం..
జగపతిబాబు కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర హైలెట్ గా నిలవనుంది.

సంగీతం...
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ఈ మేరకు ట్యూన్స్ కూడా రెడీ అయ్యాయి.

మైల్ స్టోన్ గా నిలుస్తుంది.
ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది.

నిర్మాణం
ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ...
ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది అన్నారు.

రివేంజ్ డ్రామా..
ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.


Click it and Unblock the Notifications











