Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Pooja Hegde పై ప్రభాస్ ఫిదా.. బ్యూటీ మాయలో పడిపోయిన యంగ్ రెబల్ స్టార్!
తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తున్న పూజా హెగ్డే భారీ హీరోలతో జతకడుతూ ప్రేక్షకులను సమ్మోహన పరుస్తున్నది. ఇటీవల ఆమె నటించిన పాత్రలు గ్లామర్పరంగానే కాకుండా అభినయం పరంగా కూడా ఆకట్టుకొన్నాయి. ప్రస్తుతం ప్రభాస్తో కలిసి రాధేశ్యామ్ అనే చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగు, రిలీజ్ కరోనావైరస్ కారణంగా పలుమార్లు వాయిదా పడింది. అయితే ఇటీవల రాధేశ్యామ్ సినిమాను చూసిన ప్రభాస్.. పూజా హెగ్డే నటనపై ప్రశంసలు వర్షం కురిపించారట.. ఆ వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్ శివారులో భారీ సెట్
రాధేశ్యామ్ సినిమా షూట్ ఇటలీ తదితర ప్రదేశాల్లో కొనసాగింది. విదేశాల్లో షూటింగుకు అనుకూలంగా లేకపోవడం వల్ల హైదరాబాద్ శివారులోని ఓ ప్రాంతంలో భారీ సెట్వేసి షూటింగు పూర్తి చేశారు. అయితే చాలా తక్కువ భాగం ప్యాచ్ వర్క్ మిగిలి ఉందనేది యూనిట్ సమాచారం.
షూటింగుతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు
అయితే షూటింగు వాయిదా పడటంతో ఈ సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని హంగులు తప్ప మినహాయిస్తే ఫస్ట్ కాపీ పూర్తయింది అనేది తాజా సమాచారం. కర్ఫ్యూ, లాక్డౌన్ కాలంలో ఇంకా కొన్ని పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
రాధే శ్యామ్ సినిమాను చూసిన ప్రభాస్
అయితే ఇటీవల ప్రభాస్తోపాటు సినిమా యూనిట్లోని కొందరు కీలక సభ్యులు కలిసి రాధేశ్యామ్ సినిమాను వీక్షించారు. అయితే సినిమా చూసిన తర్వాత పూజా హెగ్డే నటనకు ప్రభాస్ ఫిదా అయ్యారు. ఆమె ఫెర్ఫార్మెన్స్ చూసి ముచ్చటపడిపోయారు. ఈ సినిమాకు పూజా హెగ్డే యాక్టింగ్ హైలెట్ అని ప్రభాస్ ప్రశంసలు గుప్పించారు. అని యూనిట్ సభ్యులు వెల్లడించారనే విషయం మీడియాలో వైరల్ అవుతున్నది.
ప్రభాస్, పూజా కెమిస్ట్రీ అదుర్స్
రాధే శ్యామ్ సినిమాలో కథ మొత్తం పూజా హెగ్డే చుట్టే తిరుగుతుంది. సముద్రంలో దాదాపు 20 నిమిషాలకుపైగా సాగే షిప్ జర్నీ సినిమాకు హైలెట్. సముద్ర ప్రయాణంలో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య ఉంటే సీన్లు చాలా అద్భుతంగా వచ్చాయి. ప్రభాస్తో పూజా హెగ్డే కెమిస్ట్రీ అదుర్స్ అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
Recommended Video
పాట మినహా షూటింగ్ పూర్తి..
ఇదిలా ఉండగా, రాధేశ్యామ్ సినిమా షూట్ విషయానికి వస్తే.. ప్రభాస్, పూజా హెగ్డేపై మరో పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఇప్పటికే సినిమా దాదాపు రెడీ అయిపోవడంతో పాటను చిత్రీకరించాలా? వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. ఇంకా కొన్ని అరకొర సీన్లు, ప్యాచ్ వర్క్ తప్పితే మూవీ షూట్ అంతా పూర్తయిందనే విషయాన్ని వెల్లడిస్తున్నారు.