కేటీఆర్-కేసీఆర్ ఎలానో.... చిరు-రామ్ చరణ్ అలా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బేనర్ నిర్మించిన చిత్రం 'ధృవ'. ఈ నెల 9న సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ వేడుకకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ... ఎందరో సీఎంల కొడుకులు ఉన్నారు. అందరూ ఎందుకు రాజకీయంగా రాణించేక పోయారు. కేటీఆర్ మాత్రమే ఎందుకు రాణించారు. ఎందుకంటే కేటీఆర్ టాలెంటెడ్ కాబట్టి. విషయం ఉంది కాబట్టే కేసీఆర్ కేటీఆర్ ను మంత్రిని చేసారు. తన స్వశక్తితో కేటీఆర్ మంత్రి అయ్యారు అంటూ పోసారి ప్రశంసించారు. కేసీఆర్-కేటీఆర్ ఎలాగో... చిరంజీవి రామ్ చరణ్ అలాగే అని పోసాని చెప్పుకొచ్చారు. చరణ్ కు టాలెంట్ ఉంది కాబట్టే టాప్ హీరోగా రాణిస్తున్నాడని తెలిపారు.


Click it and Unblock the Notifications











