Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మహేష్ ని ప్రశంసిస్తూ ప్రకాష్ రాజ్ ఇలా...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సినీనటుడు మహేశ్బాబు ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోనున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడాక ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మహేశ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రకాష్ రాజ్ ఆయన్ను ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేసారు.
Dear
mahesh...
Proud
of
u.
Wonderful
step
ahead.
Great
initiative
..
Thank
you..
Let's
give
back
to
life
Cheers
https://t.co/8Lx5t4kX7C
—
Prakash
Raj
(@prakashraaj)
September
29,
2015
ఇక గ్రామాల దత్తత నేపథ్యంగా మహేశ్ నటించిన 'శ్రీమంతుడు' చిత్రం ఇటీవలే విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. గ్రామాన్ని దత్తత తీసుకునే అంశాన్ని కమర్షియల్ పాయింట్గా తీసుకుని తెరకెక్కించిన విధానం అందరికి బాగా నచ్చింది. ఈ చిత్రం ఎందరో ప్రముఖులను కదిలించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ శ్రీమంత్రుడు చిత్రాన్ని చూసి మహేశ్బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు.గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన మహేశ్బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్కు హామీ ఇచ్చారు.
మహేశ్బాబు, శ్రుతిహాసన్లు ప్రధాన పాత్రల్లో విడుదలైన 'శ్రీమంతుడు' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ స్పెషల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ విషయాన్ని మహేశ్బాబు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
చిత్రం విజయం సాధించడానికి కారణమైన, తమపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఓ కోటీశ్వరుడు గ్రామాన్ని దత్తత తీసుకునే అంశంపై దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.