Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మాజీ లవర్ని ఇరుకున పెట్టిన ప్రీతి.. జైలుశిక్ష తప్పదా?.. సాక్షులుగా క్రికెటర్ తండ్రి, భర్త
తనపై లైంగిక దాడికి ప్రయత్నించడంతోపాటు అసభ్య పదజాలంతో దూషించాడనే ఆరోపిస్తూ పారిశ్రామికవేత్త నెస్వాడియాపై బాలీవుడ్ తార ప్రీతిజింటా కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఐపీల్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు వీరిద్దరూ సహ యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరి మధ్య గొడవ 2014 మే 30వ తేదీన వాంఖేడే స్టేడియంలో జరిగింది. ఈ కేసులో ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు తాజాగా చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం.
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో సేడియం టికెట్ల గురించి జట్టు సిబ్బందిపై నెస్ వాడియా దుర్బాషలాడంటూ ప్రీతి జింటా తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఆ తర్వాత తనతో గొడవ పడి తనపై అఘాయిత్యానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.
బెయిల్పై నెస్ వాడియా
గొడవ సందర్భంగా తన చేతి పట్టుకొని లాగాడాని, అప్పుడు తన చేతికి అయిన గాయాలను ఫొటోలతో సహా పోలీసులకు అందజేసింది. ఈ వ్యవహారంలో ముంబై చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 200 పేజీల చార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ కేసులో నెస్ వాడియా 20 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ తీసుకొన్నాడు.
బ్రేకప్ తర్వాతే వేధింపులు
2014 జూన్ 13న ప్రీతిజింటా దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా నెస్ వాడియాపై ఐపీసీ సెక్షన్ 354 (మహిళపై నేరపూరిత దాడి), 506 (నేరపూరిత దాడి), 509 (మహిళపై అశ్లీల పదజాలం, దూషణ) కింద కేసు నమోదు చేశారు. తమ మధ్య బంధానికి పుల్స్టాప్ పడిన తర్వాత వేధింపుల పర్వం ఎక్కువైందని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది.
దక్షిణాఫ్రికా క్రికెటర్ తండ్రి సాక్షిగా
ప్రీతిజింటా, నెస్ వాడియా కేసులో దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తండ్రి అండ్రూ మిల్లర్ కీలకమైన సాక్షిగా మారడం వివాదం కొత్త మలుపు తిరిగింది. వారిద్దరూ గొడవ పడటం చూశాను. ప్రీతి చేయిపట్టి నెస్ వాడియా లాగడం తాను గమనించలేదు. వారికి నేను దూరంగా కూర్చోవడం ద్వారా సరిగా గుర్తించలేదు అని అండ్రూ మిల్లర్ పేర్కొన్నారు.
భార్తగా మారిన సాక్షి
ఈ కేసులో అమెరికా జాతీయుడు జీన్ గుడెనఫ్ కూడా ఓ సాక్షిగా ఉన్నాడు. ఇతడిని 2016లో ప్రీతిజింటా వివాహం చేసుకొన్నది. గొడవ జరిగినప్పుడు తానే జోక్యం చేసుకొని వారిద్దరి విడిపించానని జీన్ గుడెనఫ్ పోలీసులకు చెప్పడంతో ఆయన ఈ కేసులో సాక్షిగా మారారు.