Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
2002 నాటి సల్మాన్ఖాన్ కేసు.. మళ్లీ విచారణ
ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఫుట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తులపైనుంచి కారు పోనిచ్చిన కేసులో తాజాగా మళ్లీ విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో 64 మంది సాక్షులను విచారించాలంటూ వారి జాబితాను విచారణాధికారులు కోర్టుకు అందజేశారు. అనంతరం సెషన్స్ కోర్టు జడ్జి కేసును ఫిబ్రవరి 12కు వాయిదా వేశారు. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి అదనపు పత్రాలు ఏమైనా ఉంటే సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించారు.
శిక్షార్హమైన హత్యానేరం కోణంలో సాక్షులను గతంలో విచారించని కారణంగా ఈ కేసును తాజాగా మరోసారి విచారించాలంటూ డిసెంబరు 5న కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ సాక్షులను విచారించాలని నిర్ణయించారు. 2002లో తన టయోటా కారులో వెళుతూ బాంద్రా సమీపంలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తులపైనుంచి పోనిచ్చారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు.
సల్మాన్ ఖాన్ 'జైహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 24, 2014లో ఈచిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీమియర్ షోకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు సల్మాన్. జనవరి 23 ముంబైలో ఈ చిత్రం ప్రీమియర్ షో జరుగనుంది.
ఈ చిత్రం తెలుగులో మెగాస్టార్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్టాలిన్' చిత్రానికి జిరాక్స్ కాపీ. స్టాలిన్ చిత్రాన్ని ఉన్నదున్నట్లు సల్మాన్ హీరోగా 'జైహో' పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తొలుత ఈచిత్రానికి మెంటల్ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ సూచన మేరకు 'జైహో'గా మార్చారు.