twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పండగ చేస్కో’ డైలాగు గురించి పూరి జగన్నాథ్

    By Srikanya
    |

    హైదరాబాద్ మహేష్ బాబు 'పోకిరి' సినిమాలోని 'పండగ చేస్కో' డైలాగ్ వినని వాళ్లు ఉండరు. ఆ సినిమా చూడనివాళ్లు కూడా ఆ డైలాగుని వినే ఉంటారు. అంతగా ఆ డైలాగు ఆ పాపులర్ అయ్యింది. మరి ఆ డైలాగు రాయటానికి పూరి జగన్నాథ్ వెనక ఉన్న కథ ఏమిటీ అన్నది ఆయన ఓ లీడింగ్ డైలీ కు వివరించారు. అదేమింటంటే...

    పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...''ఇది ఆ పాత్రకు అనుగుణంగా ఓ ఫ్లోలో రాసిన డైలాగ్. ఇంత క్లిక్ అవుతుందని నేనే ఊహించలేదు. నా కళ్ల ముందే చాలా మంది ఈ డైలాగ్‌ని విరివిగా వాడడం చూసి ఆశ్చర్యపోయాను. ఒక్కోసారి అంతే. ప్రేక్షకులకు కనెక్టయితే ఆ డైలాగ్ అలా వాళ్ల మనుగడలో కలిసిపోతుంది. ఇదీ అంతే'' అన్నారు.

    ఇక చిత్రంలో ఈ డైలాగు ...ఎక్కడ వస్తుందంటే...లోకల్ ట్రెయిన్ కోసం ఎదురు చూస్తున్న బ్రహ్మానందం దగ్గరకు అలీ వచ్చి ముష్టి అడుగుతాడు. బ్రహ్మానందం స్టయిల్‌గా ఓ రూపాయి తీసి ''పండగ చేస్కో'' అంటాడు.

    అలీ ఆ రూపాయినొకసారి చూసి ''దీంతో ఏ పండగ చేస్కోవాలి? క్రిస్‌మస్సా? సంక్రాంతా?'' అని చిరాకుపడతాడు. అప్పటి నుంచీ 'పండగ చేస్కో' డైలాగ్‌ జనంలో కలిసిపోయింది. ఆ మధ్యన ఈ డైలాగుని ఓ దర్శకుడు టైటిల్ గా కూడా రిజిస్టర్ చేసారు.

    English summary
    
 Puri Jagannath happy with Pandaga Chesko title. It's written by puri used in Pokiri film by Ali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X