Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఘాజి దర్శకుడిపై న్యాయపోరాటం చేయనున్న నిర్మాత.. వివాదానికి కారణం!
ఘాజి చిత్రంతో ప్రతిభ గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సంకల్ప్ రెడ్డి. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఆసక్తికరమైన చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నాడు. సంకల్ప్ రెడ్డి తెరకెక్కించబోతున్న ఈ చిత్రం అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో రూపుదిద్దుకోబోతోంది. వరుణ్ తేజ్ సరసన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అతిధి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రానికి ఆరంభంలోనే చిక్కులు మొదలయ్యాయి. దర్శకుడు సంకల్ప్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నాడు. ఘాజి చిత్రం ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ నిర్మణంలో పివివి బ్యానర్ లో తెరకెక్కింది. రెండవ చిత్రాన్ని కూడా తమ నిర్మాణంలోనే రూపొందించాలని నిర్మాత దర్శకుడితో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పివిపి నిర్మాణంలో కాకుండా రాజీవ్ రెడ్డి నిర్మణంలో ఈ దర్శకుడు సినిమా చేస్తుండడంతో వివాదం మొదలైంది.
సంకల్ప్ రెడ్డిపై చట్టపరమైన పోరాటం చేయడానికి నిర్మాత సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కనుక జరిగిది వరుణ్ తేజ్ చిత్రానికి చిక్కులు మొదలైనట్లే అని చెప్పుకోవచ్చు. ఘాజి చిత్రం ఇండియా పాక్ మధ్య సబ్ మెరైన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే.