Don't Miss!
- News rasi phalalu today: ఈ రాశులవారు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
లండన్లో రాశీఖన్నా హల్చల్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్తో..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన చిత్రం జై లవకుశ. జూనియర్ ఎన్టీఆర్ సరసన ప్రధాన కథానాయికలుగా రాశీఖన్నా, నివేదా థామస్ నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2400 స్క్రీన్లలో రిలీజ్ అయింది. లండన్లో సినీ అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ కోసం జై లవకుశ చిత్ర ప్రీమియర్లను ప్రదర్శించారు. ప్రస్తుతం లండన్లో ఉన్న రాశీఖాన్నా అభిమానులతో కలిసి చూశారు. ఈ చిత్ర విజయంలో అభిమానులతోపాటు ఆమె కూడా భాగమయ్యారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్తో
ఎన్టీఆర్తో రొమాన్స్ చేసిన రాశీఖన్నా తన నటనను లండన్ స్క్రీన్లపై ఆస్వాదించారు. చిత్ర వీక్షణ అనంతరం అభిమానులతో కలిసి ఆమె ఫోటోలు దిగారు. లండన్లోని ప్రదర్శించిన ప్రీమియర్కు నందమూరి అభిమానులు జై లవకుశ టీషర్టలను ధరించి రావడం గమనార్హం.
జై లవకుశ చిత్రంలో
జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్, రాశీఖన్నా స్టెప్పులు వేసిన ట్రింగ్ ట్రింగ్ పాటకు లండన్లో మంచి రెస్పాన్స్ వచ్చినట్టు సమాచారం. ఎన్టీఆర్ డ్యాన్సులను, డైలాగ్స్, యాక్షన్ అంశాలకు అభిమానుల నుంచి మంచి ప్రతిస్పందన కనిపించిందట.
జై లవకుశ కోసం
జై లవకుశ కోసం రాశీ ఖన్నా తన బరువును తగ్గించుకున్నారు. సినిమాలో చాలా నాజుక్కుగా కనిపించి గ్లామర్తో ఆకట్టుకున్నది. రాశీఖన్నాకు పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోవడంతో పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. రాశీఖాన్నా కెరీర్లో జై లవకుశ భారీ చిత్రమేకాకుండా మంచి హిట్ చిత్రంగా నిలిచింది.
ఓవర్సీస్లో మంచి రిపోర్ట్
జై లవకుశ చిత్రానికి ఓవర్సీస్లో కూడా మంచి రిపోర్ట్ వస్తున్నది. విదేశాల్లో కూడా భారీ కలెక్షన్లను సొంతం చేసుకొనే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ఏపీ, తెలంగాణలో మొదటి రోజు 21 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తున్నది.