Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మీడియాపై భగ్గుమన్న బాలయ్య 'లెజెండ్' హీరోయిన్: ఎందుకు?
నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా చేసిన ‘లెజెండ్’ సినిమాలో హీరోయిన్గా నటించిన రాధికా ఆప్టే మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
ముంబై: నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా చేసిన 'లెజెండ్' సినిమాలో హీరోయిన్గా నటించిన రాధికా ఆప్టే మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ముంబైలోని ఒక మాల్లో బాలీవుడ్ సినిమా 'బజార్' షూటింగ్ జరుగుతోంది. కొంత షూటింగ్ ముగిసిన తరువాత రాధిక లంచ్ కోసం తన వ్యానిటీ వ్యాన్లోకి వెళ్లింది.
ఆ తర్వాత కాసేటికి ఆమె వ్యాన్ నుంచి బయటకు వచ్చింది. ఇంతలో అక్కడ చేరిన ఫొటోగ్రాఫర్లు ఆమె పర్సనల్ మూమెంట్లపై కెమెరాలు క్లిక్ మనిపించారు. దీంతో రాధిక ఒక్కసారిగా వారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ తన పర్మిషన్ లేకుండా ఫొటోలు ఎందుకు తీస్తున్నారని మండిపడింది.
వాటిని వెంటనే డిలీట్ చేయాలని ఆమె డిమాండ్ చేసింది. రాధికా ఆప్టే లుక్ను అప్పుడే విడుదలచేయాలని ఈ సినిమా నిర్మాతలు అనుకోవడంలేదు. అందుకే ఆమె ఆగ్రహం వ్యక్తంచేసిందని ఫొటోగ్రాఫర్లు అంటున్నారు.
ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, చిత్రాంగదా సింగ్ తదితరులు నటిస్తున్నారు.