Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నట్టి కుమార్ నిర్మాతగా... డాక్టర్ రాజశేఖర్
వరసగా ఆగిపోయిన సినిమాలను తీసుకుని రిలీజ్ చేస్తున్న నట్టికుమార్ నిర్మాతగా రాజశేఖర్ ఓ చిత్రం చేస్తున్నారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో విశాఖ టాకీస్ పతాకంపై నిర్మించే ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 5న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమవుతుంది. శ్రీహరి తో చేసిన 'దాసన్నా' చిత్రం తర్వాత తను నిర్మించే మరో ప్రతిష్టాత్మక చిత్రం ఇదనీ, ఈ సినిమా కూడా తమ సంస్థ ప్రతిష్టను పెంచుతుందనే నమ్మకం ఉందని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. అలాగే 'గోరింటాకు' చిత్రం తర్వాత డా.రాజశేఖర్ ఈ సినిమాలో మరో ఉదాత్తమైన పాత్రను పోషిస్తున్నారనీ, ఏడుగురు తమ్ములకు అన్నగా ఆయన పాత్ర ఎంతో హుందాగా ఉంటుందని ఆయన తెలిపారు. ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తారని, వారి వివరాలను చిత్రం ప్రారంభోత్సవం రోజున వెల్లడిస్తామని నట్టి కుమార్ చెప్పారు. చిత్ర నిర్మాణంగా ఎక్కడా రాజీ పడకుండా భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తామని, పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన స్క్రిప్ట్ అందించారని ఆయన తెలిపారు.