Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మోహన్ బాబు చేస్తే తప్పు.. రజిని చేస్తే కాదా..!? అప్పట్లో రాజకీయ కారణాలు నిజమేనా..??
అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన పద్మశ్రీని "దేనికైనా రెడీ" చిత్రంలో వాణిజ్యపరంగా వాడినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం అందచేసిన ఈ పద్మశ్రీ అవార్డులను వారం రోజుల్లో వెనక్కి ఇవ్వాలని ఆ సినిమా నిర్మాత మోహన్బాబు, హస్యనటుడు బ్రహ్మనందాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నటుడు, నిర్మాత మోహన్బాబు నిర్మించిన దేనికైనా రెడీ చిత్రంలో అత్యున్నతమైన సేవలకు గుర్తింపుగా ఇచ్చే పురస్కారాన్ని ఇంటి పేరుగా వాడుకోని దాని విలువను నెైతికంగా దిగజార్చారని, పద్మ పురస్కారాన్ని వాణిజ్య పరంగా వాడుకోవడంపెై ఆవేదన వ్యక్తం చేస్తూ పిటిషనర్ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రాసేనారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు..
వారు స్వచ్ఛందంగా అవా ర్డులను వారంలోగానే స్వయం గా తిరిగి ఇచ్చేయాలని, భారత రాష్టప్రతి కి అందజేయాలని హై కోర్టు సూచించింది. తర్వాత సుప్రీం కోర్టు లో మళ్ళీ అప్పీలు చేసిన మోహన్ బాబు గెలిచి తన అవార్డుని కాపాడుకున్నారు అది వేరే విశయం కానీ ఇప్పుడు ఇదే తప్పు ఇంకో నటుడి విశయం లో జరిగినా ఎవరూ మాట్లాడటం లేదు.
కబాలీ చిత్రం కబాలి టైటిల్స్ లో అయితే రజినికాంత్ మాత్రం స్క్రీన్ నేమ్ సూపర్ స్టార్ తో పాటుగా పద్మవిభూషన్ రజినికాంత్ అని వేసుకున్నారు. మరి సినిమా పరిశ్రమకు సంబందించినంతవరకు అందరికి ఒకే రకమైన రూల్ ఉండాలి కాని మోహన్ బాబు తన పేరు ముందు పద్మను వాడితే గొడవ పెట్టిన వారు ఇప్పుడు రజిని విషయంలో ఎందుకు మాట్లాడట్లేదో అర్థం కావటం లేదంటూ. తెలుగు సినీ పరిశ్రమలో పలువురు మాట్లాడుకుంటున్నారు. అసలు మొహన్ బాబు, రజినీ కాంత్ ల విశయం లో ఎందుకింత తేడా..? వివరాలు స్లైడ్ షోలో...
మోహన్ బాబు చేస్తే తప్పు.. రజిని చేస్తే కాదా..!? అప్పట్లో రాజకీయ కారణాలు నిజమేనా..??
1975లో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన "స్వర్గం నరకం" చిత్రం ద్వారా ఈయన తెలుగు తెరకు పరిచమయ్యారు. ఈ సినిమాతోనే మంచు భక్తవత్సలం నాయుడు అనే పేరును మోహన్ బాబుగా మార్చడం జరిగింది. దాసరి నారాయణ రావు శిష్యుడిగా ఆయన గుర్తింపు పొందారు.
మోహన్ బాబు చేస్తే తప్పు.. రజిని చేస్తే కాదా..!? అప్పట్లో రాజకీయ కారణాలు నిజమేనా..??
ఆ తర్వాత ఆయన అనేక హిట్ చిత్రాల్లో కామెడి విలన్, విలన్, హీరో పాత్రలలో నటించి ప్రజల మన్ననలు పొందారు. ఆ తర్వాత 1981లో తన కూతురు పేరు మీద "శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్" అనే నిర్మాణ సంస్థను స్థాపించి, నిర్మాతగా "అల్లుడు గారు", "అసెంబ్లీ రౌడీ", "రౌడీగారి పెళ్ళాం", "మేజర్ చంద్రకాంత్", పెదరాయుడు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు.
2007 లో మోహన్ బాబుకి పద్మశ్రీ ఇచ్చారు.
2007 లో మోహన్ బాబుకి పద్మశ్రీ ఇచ్చారు. ‘దేనికైనా రెడీ' సినిమాలో అనధికారికంగా పద్మశ్రీ అనేదాన్ని తన పేరు ముందుకు వేసుకున్నారని హై కోర్టులో కేసు వేసారు. దాంతో హై కోర్టు పద్మశ్రీని తిరిగి వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది.
మోహన్ బాబు చేస్తే తప్పు.. రజిని చేస్తే కాదా..!? అప్పట్లో రాజకీయ కారణాలు నిజమేనా..??
1996లో కమర్షియల్ అంశాల్లో అవార్డు గ్రహీతలు పద్మశ్రీ, పద్మభూషన్ వంటి బిరుదలను పేర్ల వెనుక, ముందు ఉపయోగించ కూడదని అప్పట్లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ, అవార్డులు వెనక్కు తీసుకునే అవకాశం కూడా ఉందని సుప్రీం రూలింగ్ ఇచ్చింది. ఇదే తీర్పుని బట్టి మోహన్ బాబు అవార్డుని వెనక్కి ఇవ్వాలంటూ హైకోర్ట్ ఆదెశించింది.
మోహన్ బాబు చేస్తే తప్పు.. రజిని చేస్తే కాదా..!? అప్పట్లో రాజకీయ కారణాలు నిజమేనా..??
మోహన్ బాబు ఒక్కరే కాదు టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా ఈ వివాదం లో ఇరుక్కున్నారు.
మోహన్ బాబు చేస్తే తప్పు.. రజిని చేస్తే కాదా..!? అప్పట్లో రాజకీయ కారణాలు నిజమేనా..??
తన ప్రేమయం లేకుండా టైటిల్స్ లో పద్మశ్రీ వాడుకున్నారని మోహన్ బాబు పేర్కొన్నారు. కానీ, మోహన్ బాబు ఇచ్చిన వివరణను హై కోర్టు తోసిపుచ్చడంతో పాటు, పద్మశ్రీ ని వెనక్కి తీసుకోవాలని పేర్కొంది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ, మోహన్ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన పిమ్మట హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పద్మశ్రీ యథాతథంగా మోహన్ బాబుకే దక్కుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది.
మోహన్ బాబు చేస్తే తప్పు.. రజిని చేస్తే కాదా..!? అప్పట్లో రాజకీయ కారణాలు నిజమేనా..??
"తనకు తెలియకుండా అలా టైటిల్ కార్డ్స్ లో పద్మశ్రీని వాడారు" అన్న పాయింట్ మీదే మొహన్ బాబు అవార్డ్ ని వెనక్కి తీసుకోవటం సబబు కాదంటూ తీర్పు చెప్పింది సుప్రీం కోర్టు. అంతే కానీ ఇక మీదట అందరూ అవార్డులని సినిమా టైటిల్స్ లో వేసుకోమని పర్మిషన్ ఇచ్చినట్టు కాదు.
అయితే సినిమా వాళ్లలో ఈ ఇద్దరే కాకుండా పద్మ
అవార్డులుపొందిన ప్రతి ఒక్కరూ కూడా తమ అవార్డులను టైటిల్ కార్డుల్లో వేయించుకుంటున్నారు. మరి వారందరి విషయం ఏంటి? అని అప్పట్లో కూడా ఎవరూ మాట్లాడలేదు. ఎటూ మొహన్ బాబు తన అవార్డుని కాపాడుకున్నాడు కదా అని వదిలేసారు.
మోహన్ బాబు చేస్తే తప్పు.. రజిని చేస్తే కాదా..!? అప్పట్లో రాజకీయ కారణాలు నిజమేనా..??
అయితే రీసెంట్ గా వచ్చిన కబాలి విశయం లో మళ్ళీ ఈ తరహా వివాదం తెర మీదికి వచ్చింది. ఈ మధ్యనే విడుదలైన "కబాలి" సినిమా టైటిల్స్ లో రజినికాంత్ మాత్రం స్క్రీన్ నేమ్ సూపర్ స్టార్ తో పాటుగా పద్మవిభూషన్ రజినికాంత్ అని వేసుకున్నారు.
మోహన్ బాబు చేస్తే తప్పు.. రజిని చేస్తే కాదా..!? అప్పట్లో రాజకీయ కారణాలు నిజమేనా..??
మరి సినిమా పరిశ్రమకు సంబందించినంతవరకు అందరికి ఒకే రకమైన రూల్ ఉండాలి కాని మోహన్ బాబు తన పేరు ముందు పద్మను వాడితే గొడవ పెట్టిన వారు ఇప్పుడు రజిని విషయంలో మాత్రం అంతా సైలెంట్ గానే ఉన్నారు.
మోహన్ బాబు చేస్తే తప్పు.. రజిని చేస్తే కాదా..!? అప్పట్లో రాజకీయ కారణాలు నిజమేనా..??
అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే మోహన్ బాబు పద్మ అవార్డ్ స్క్రీన్ మీద వేసుకోవడం గురించి ఎవరో ఒక అతను కోర్ట్ లో పిల్ వేశాడు. కాని రజినికాంత్ గురించి అలా ఎవరైనా సరే కేసు వేస్తే అప్పుడు మత్రమే దాని గురించి మాట్లాడతారేమో..
మోహన్ బాబు చేస్తే తప్పు.. రజిని చేస్తే కాదా..!? అప్పట్లో రాజకీయ కారణాలు నిజమేనా..??
ఏదేమైనా మోహన్ బాబు మీద కూడా అప్పట్లో ఆ వివాదానికి కారణం ఏదో ఒక సామాజిక వర్గం తో ఉన్న విభేదాల వల్లే వాళ్ళు చేసారు తప్ప లేక పోతే ఎవరికి పట్టింది..! రజినీ అలా ఎవరితోనూ పెట్టుకోకుండా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతను ఆ బిరుదుని ఎలా వాడుకున్నా అనవసరం. రాజకీయ కారణాలు ఇప్పుడు పనికి కూడా రావుకదా... అంటూ బహిరంగం గానే వ్యాఖ్యానిస్తున్నారు మన ఫిలిం నగర్ జనాలు.
మోహన్ బాబు చేస్తే తప్పు.. రజిని చేస్తే కాదా..!? అప్పట్లో రాజకీయ కారణాలు నిజమేనా..??
కబాలి రిజల్ట్ తో పాటుగా ఇప్పటికే లింగా సినిమా గొడవలతో ఉన్న రజినికి ఈ కొత్త తలనొప్పి ఎందుకనుకున్నారో ఏమో ఎవరు ఏ విషయం గురించి మాట్లాడట్లేదు. ఏది ఏమైనా రజిని చేస్తే మాట్లాడరు కాని మోహన్ బాబు విషయం లో మాత్రం కాస్త ఎక్కువ చేసారు అనే అనాలి...