హాట్ న్యూస్: మణిరత్నం దర్శకత్వంలో సూపర్ స్టార్ ఖరారు
ఈ మేరకు మణిరత్నం ఓ స్టోరీ లైన్ ని రజనీకాంత్ కి చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. తమిళంలో భారీ చిత్రాలు నిర్మించిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్ధ ఈ చిత్రం నిర్మించనుంది. రజనీకాంత్ కి సరపడ మాస్ ఇమేజ్ ని, తనదైన క్లాస్ స్టైల్ లో మరోసారి ఆవిష్కరించనున్నారని అంటున్నారు. ఇక మణిరత్నం చిత్రం అనగానే మార్కెట్ వర్గాల్లో అప్పుడే కలకలం మొదలైంది. ఓ రేంజిలో బిజినెస్ జరుగుతుందో అని ట్రేడ్ లో లెక్కలు వేసుకుంటున్నారు.
ఇక తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన 'విక్రమసింహా'సంక్రాంతిరోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకన్నా ముందే 'శివాజీ 3డీ' రజనీ పుట్టినరోజు కానుకగా డిసెంబరు 12న థియేటర్లలో సందడి చేయనుంది.రజనీకాంత్ నటించిన 'విక్రమసింహ'ను 12-12-12 అనే అరుదైన తేదీన తెరపైకి తీసుకురావాలనుకొన్నారు.
తేదీలో అన్నీ పన్నెండులు ఉండటమే కాదు... ఆ రోజునే రజనీ జన్మదినం. ఈ సందర్భంగా 'విక్రమసింహ'ను విడుదల చేస్తే క్రేజ్ వస్తుందని దర్శకనిర్మాతలు భావించారు. అయితే ఆ చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో వాయిదా వేశారు. అయితే రజనీ పుట్టిన రోజున ఆయన సినిమా ఒకటి విడుదలవుతోంది. అదేమిటంటే శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'శివాజి'. 2007లో వచ్చిన ఆ చిత్రానికి త్రీడీ హంగులు అద్దారు. ఇటీవలే ఆ సాంకేతిక కార్యక్రమాలు ముగిశాయి. చిత్ర నిర్మాణ సంస్థ ఏవీఎమ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ''రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 12న శివాజి త్రీడీని తెరపైకి తీసుకొస్తున్నాము''అన్నారు. ఇందులో శ్రియ కథానాయికగా నటించింది. త్రీడీకి అనుగుణంగా చిత్ర నిడివిని కొంత వరకూ తగ్గించారు.


Click it and Unblock the Notifications












