కమెడియన్ సత్యకు రామ్ చరణ్ స్వీట్ షాక్.. ఓన్ ఫ్లైట్లో హైదరాబాద్ కి!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్న ఆయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ అమృత్ సర్ లో పూర్తి కాగా హైదరాబాద్ తిరిగి వచ్చారు రాంచరణ్. ఈ సందర్భంగా తన ఫ్లైట్ లో కమెడియన్ సత్యను కూడా తీసుకు రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితేమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్న ఆయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ అమృత్ సర్ లో పూర్తి కాగా హైదరాబాద్ తిరిగి వచ్చారు రాంచరణ్. ఈ సందర్భంగా తన ఫ్లైట్ లో కమెడియన్ సత్యను కూడా తీసుకు రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

సేవా కార్యక్రమాల్లో కూడా
రామ్ చరణ్ తేజ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ ముందుకు వెళుతున్నారు. కేవలం నటనా పరంగానే గాక మెగాస్టార్ చిరంజీవి చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు అవుతున్నారు. ఆయన మాత్రమే కాకుండా ఆయన భార్య ఉపాసన కూడా తన వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తున్నారు.

డ్రాప్ చేసి
అయితే రామ్ చరణ్ తేజ ఇప్పుడు అనూహ్యంగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు దానికి కారణం తనతో పాటు ఒక కమెడియన్ ను తన సొంత ఫ్లైట్లో తీసుకురావడమే. సాధారణంగా హీరోలు ప్రయాణించడం కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు అలాగే మిగతా నటీనటులు, సిబ్బంది కోసం వేరే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కానీ తన వెంట సత్యను తీసుకువచ్చి హైదరాబాదులో డ్రాప్ చేసి రామ్ చరణ్ సత్యకి ఒక స్వీట్ షాక్ ఇచ్చారనే చెప్పాలి.

శంకర్ దర్శకత్వంలో
ఇక ఇప్పుడు ఈవిషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. చిరుత సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తర్వాత ఒక్కో సినిమాతో తన క్రేజ్ పెంచుకుంటూ వెళ్లారు. చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాంచరణ్ తేజ తర్వాత తన తండ్రితో కలిసి చేసిన ఆచార్య సినిమాతో మాత్రం డిజాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నారు

గాల్లో తేలిపోయాడు అంటూ
దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో జరుగుతోంది. ఈ షూటింగ్ నిమిత్తం తన సొంత ఫ్లైట్లో అక్కడికి వెళ్లిన రామ్ చరణ్ తేజ వచ్చేటప్పుడు మాత్రం తనతో పాటు టాలీవుడ్ కమెడియన్ సత్యను కూడా తీసుకురావడం గమనార్హం. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను పంచుకున్నారు. సత్తి నువ్వు సోషల్ మీడియాలో లేవు కాబట్టి నీ ఆనందాన్ని నా ద్వారా చెబుతున్న మా సత్తి ఆ రోజంతా గాల్లో తేలిపోయాడు అంటూ గెటప్ శీను తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Recommended Video


కీలక పాత్రలలో
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శ్రీకాంత్, అంజలి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. గతంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన వెలువడింది.


Click it and Unblock the Notifications











