Just In
- 15 min ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
- 26 min ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 1 hr ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 2 hrs ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
Don't Miss!
- Finance
ఒక్కరోజులో రూ.2.08 లక్షల కోట్ల సంపద హాంఫట్: 3 రోజుల్లో 1800 పాయింట్లు..
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రంగస్థలం తర్వాత.. రాంచరణ్ దృష్టి అక్కడ.. ఆయనకు నేను వీరఫ్యాన్ను!

రంగస్థలం లాంటి బ్లాక్బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ దృష్టి బాలీవుడ్పై పడింది. ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గతంలో బిగ్బీ అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ చిత్ర రీమేక్తో రాంచరణ్ బాలీవుడ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఆ చిత్రం దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కొన్నేళ్లుగా బాలీవుడ్కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పలు విషయాలు వెల్లడించారు.

మరోసారి బాలీవుడ్పై దృష్టి
దక్షిణాది హీరోల దృష్టి ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమపై పడింది. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ కార్వాన్ అనే చిత్రంతో హిందీలోకి ప్రవేశిస్తున్నారు. ఇక మరోసారి రాంచరణ్ బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఆయనకు నేను వీరఫ్యాన్ను
బాలీవుడ్లో ప్రముఖ దర్శక, నిర్మాత రాజ్ కుమార్ హిరాణికు వీర ఫ్యాన్ను. ఆయనతో పనిచేయాలని ఉంది. కమర్షియల్, ఆర్ట్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు తీయడంలో ఆయనకు ఎదురులేదు. అలాంటి దర్శకుడితో పనిచేయాలని ఉంది అని రాంచరణ్ అన్నారు.

విశాల్ భరద్వాజ్ అంటే నాకు ఇష్టం
అలాగే నాకు దర్శకుడు విశాల్ భరద్వాజ్ అంటే కూడా ఇష్టం. అతను రూపొందించిన చిత్రాలంటే చాలా ఇష్టం. ఆయనతో పనిచేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తాను. గతంలో జంజీర్ చిత్రంలో నటించాను. కానీ అది సరిగా ఆడలేదు. మరోసారి బాలీవుడ్లో నటించాలని ఆసక్తి కలుగుతున్నది. ట్రై చేస్తే తప్పేముంది అని రాంచరణ్ పేర్కొన్నారు.

మంచి స్టోరి లభిస్తే
బాలీవుడ్లో మంచి దర్శకుడు, కథ, ప్రొడక్షన్తో కూడిన ప్రాజెక్ట్ లభిస్తే నేను నటించడానికి సిద్ధం. నాకున్న మార్కెట్ను బట్టి ఈసారి ప్రయత్నిస్తాను అని రాంచరణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మంచి కథ దొరికితే ఏ భాషలోనైనా నటించడానికి సిద్దం అని అన్నారు.

హీరోయిన్ ఎవరైనా సరే..
కథను బట్టి బాలీవుడ్లో ఏ హీరోయిన్తోనైనా నటిస్తాను. కానీ కథ డిమాండ్ చేయాలి. ప్రతీ ఒక్కరు గొప్ప సినిమాలు చేస్తున్నారు. మెరుగైన నటన ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకంగా ఫలానా హీరోయిన్ అని రిజర్వేషన్స్ ఏమీ లేవు అని చెర్రీ వెల్లడించారు. గతంలో జంజీర్లో ప్రియాంక చోప్రాతో జతకట్టిన సంగతి తెలిసిందే.