Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వర్మ పోటీకి లక్ష 80 వేల మంది ఎన్ రోల్
రామ్ గోపాల్ వర్మ 'ఆవహం' చిత్రాన్ని ఒంటరిగా చూసిన వారికి 5 లక్షల బహుమతి ఇస్తామని పోటీ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పోటీకి భారీ ప్రతిస్పందన లభించిందని, దాదాపు ఒక లక్ష, 80 వేల మంది ఈ పోటీకి ఎన్ రోల్ చేసుకన్నారని నిర్మాత బుర్రా ప్రశాంత్ చెప్తున్నారు. అలాగే వీరిలో ఒకరిని సినిమా చూసేందుకు ఎంపిక చేయనున్నాం. ఒక్క వ్యక్తి చూసే ప్రదర్శన ముంబైలో జరుగుతుంది ఆయన అన్నారు. 'ఫూంక్-2' చిత్రం తెలుగులో 'ఆవహం' పేరుతో డబ్బింగై రిలీజవుతోంది.
'ఆవహం' చిత్రాన్ని ఈనెల 16వ తేదీన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దేశవ్యాప్తంగా 1200 థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మిలింద్ గదగ్కర్ మాట్లాడుతూ, 'సుఖాంతమైన 'ఫూంక్' చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుంది. ఆ చిత్రంలో చనిపోయిన మంత్రగత్తె దయ్యమైతే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథాంశం అన్నారు. అలాగే రామ్ గోపాల్వర్మ హిందీలో రూపొందించిన చిత్రాలకు రచయితగా పనిచేసిన తనకిది దర్శకుడిగా తొలి చిత్రమని మిలింద్ గదగ్కర్ తెలిపారు.