Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పూరి కొడుకు ప్రేమ కథలో రియల్ లైఫ్ జంట!
దర్శకుడు పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరితో మెహబూబా చిత్రం చేస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే మెహబాబా చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో జరిగే ఉత్కంఠ భరితమైన ప్రేమ కథగా దర్శకుడు పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కన్నడ అందాల తార నేహా శెట్టి ఈ చిత్రంలో ఆకాష్ పూరి సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. మెహబూబా చిత్రంలో రియల్ లైఫ్ జంట నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మురళీశర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. మురళి శర్మ భార్య అశ్విని కశ్లేఖర్ ఈ చిత్రంలో కూడా మురళి శర్మ భార్య గానే నటిస్తున్నారట. అశ్విని కశ్లేఖర్ హిందీ సీరియల్స్ లో ప్రధాన నటిగా నటిస్తున్నారు. వీరిద్దరూ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అశ్విని పలు చిత్రాల్లో కూడా నటించారు.