Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మళ్లీ అండర్వరల్డ్ మీద ఫోకస్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ
అండర్ వరల్డ్ సినిమాలంటే మనకు ముందుగా గుర్చొచ్చేది రామ్ గోపాల్ వర్మ పేరు. సత్య, కంపెనీ లాంటి సినిమాల్లో అండర్ వరల్డ్ మాఫియా గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే కేవలం మూడు గంటల సినిమాలో ఏదైనా అంశాన్ని కూలంకశంగా చూపించడం ఏ దర్శకుడికైనా కష్టమే. అలా సాధ్యం కాని వాటిని వెబ్ సిరీస్ రూపంలోకి తెస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఇపుడు ఇదే దారిలో ప్రయాణిస్తున్నారు.
త్వరలో 'డి-కంపెనీ' పేరుతో వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు వర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. ముంబై మాఫియా నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని, మొత్తం ఐదు సీజన్లుగా దీన్ని ప్లాన్ చేస్తున్నామని, ఒక్కో సీజన్లో 10 ఎపిసోడ్లు ఉంటాయని తెలిపారు.
ఈ వెబ్ సిరీస్ కోసం గడిచిన 20 ఏళ్ల నాటి ఎన్నో విషయాలు సేకరించామని, ముంబై అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రస్తావన ఇందులో ఉంటుందని, ఈ ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఇందులో చూపించబోతున్నామని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
బాలీవుడ్ నిర్మాత మధు మంతెన కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారట. ఇలాంటి సినిమాలు తీయడంలో ఎక్స్పర్ట్ అయిన వర్మ వెబ్ సిరీస్లో ఎన్నో కఠిన వాస్తవాలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది హిందీతో పాటు తెలుగులోనూ విడుదలవుతుందని సమాచారం.