కేసీఆర్పై మెగా హీరో సంచలన కామెంట్స్
రాష్ట్రంలోని అనాథలందర్నీ అక్కున చేర్చుకోవాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై టాలీవుడ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో చప్పట్లతో స్వాగతించారు.
తెలంగాణ ప్రభుత్వంపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలోని అనాథలందర్నీ అక్కున చేర్చుకోవాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై ట్విట్టర్ లో చప్పట్లతో స్వాగతించారు. తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకొన్నది అని ట్వీట్ చేశారు.
రాష్ట్రంలోని అనాథల సంరక్షణకు సంబంధించిన పూర్తి బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్నది. వారికి విద్యా బోధన, హాస్టల్ వసతి కల్పిస్తాం అని తెలంగాణ ప్రభుత్వం ట్విట్టర్ లో ప్రకటించింది. తెలంగాణ సీఎంవో ట్వీట్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో ట్యాగ్ చేయడం గమనార్హం.
sai dharam tej kcr telangana government orphans సాయి ధరమ్ తేజ్ కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అనాథల సంరక్షణ


Click it and Unblock the Notifications