వర్షం ఎఫెక్ట్: సల్మాన్ తీర్పు 24కి వాయిదా
నగరంలో కురిసిన భారీ వర్షం వల్ల కోర్టు సిబ్బంది హాజరుకాలేదు. దీనికితోడు ఈ కేసు తీర్పును వాయిదా వేయాలని సల్మాన్ తరఫు న్యాయవాది కోరారు. ఈ మేరకు కేసు తీర్పును 24కి సెషన్స్ జడ్జి యూబీ హెజీబ్ వాయిదా వేశారు. 2002, సెప్టెంబరు 28న సల్మాన్ఖాన్ నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో రోడ్డు పక్కన పడుకున్న వారిని డీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నలుగురికి గాయాలయిన సంగతి తెలిసిందే.
సల్మాన్పై హత్యతో సమానమైన శిక్షార్హ నరహత్య అభియోగం పై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు త్వరలోనే తేలనుంది. ఈ అభియోగం కింద అతనికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దాంతో ఆయన ఆయన అభిమానుల్లో,శ్రేయాభిలాషుల్లో టెన్షన్ మొదలైంది.
మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 17 మంది సాక్షులను విచారించిన అనంతరం కేసు తీవ్రమైందిగా పరిగణించింది. ఈ కేసు సెషన్స్ కోర్టులో విచారించదగిందని పునర్విచారణ కోసం కేసును సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది.
నిర్లక్ష్యంతో ఒకరి మరణానికి కారణమైనందున ఐపీసీ 304ఏ సెక్షన్ కింద సల్మాన్ను తొలుత మేజిస్ట్రేట్ విచారించిన సెక్షన్ కింద అతనికి దాదాపు రెండేళ్లు శిక్ష పడే అవకాశం ఉండేదని వాదోపవాదాలకు అవకాశమివ్వాలంటూ సల్మాన్ న్యాయవాది రాతపూర్వకంగా విన్నవించారు.
ఈ కేసులో సాక్షిగా ఉన్న సల్మాన్ అంగరక్షకుడు రవీంద్ర పాటిల్ ఇటీవలే మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్తో పాటే కారులో ఉన్నారని, వేగంగా నడపకూడదని, ఏదైన ప్రమాదం జరగుతుందని హెచ్చరించినప్పటికీ అతని మాటలు సల్మాన్ పట్టించుకోలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఖాన్ పరిమితికి మించి మద్యంసేవించి ఉన్నారని అతని రక్తనమూనాలో 60 మిల్లీగ్రాముల అల్కహాల్ను గుర్తించినట్లు ఆయన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ కేసుతో సంబంధం గల మరో పిటిషన్పైన కోర్టు జూన్ 10న తీర్పు ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications












