Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చైతుతో ఆ విషయాలు మాట్లాడను.. అది నేర్చుకున్నా.. సమంత!
నాగచైతన్య, సమంత గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సమంత రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో పలు విషయాలు వెల్లడించింది. సమంత ఇటీవల రంగస్థలం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో సమంత సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో సమంత అద్భుత నటన కనబరిచింది. పల్లె టూరి యువతిగా రామలక్ష్మి పాత్రలో సమంత ఆకట్టుకుంది.
చైతు, తాను మంచి పరిపక్వతతో వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నామని సమంత తెలిపింది. సినిమాకు సంబందించిన విషయాలు తాము మాట్లాడుకోమని సమంత తెలిపింది. తన చిత్రాల గురించి కథల గురించి చైతు తో చర్చించను. అతడు కూడా సినిమాకు సంబందించిన విషయాలు ఇంట్లో ప్రస్తావించడు అని సమంత తెలిపింది. ప్రొఫెషనల్ లైఫ్ కి సంబందించిన విషయాలు ఏవి తమ మధ్య చర్చకు రావని సమంత తెలిపింది.
తాను చైతుని చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని సమంత తెలిపింది. తన చిత్రాలు పరాజయం చెందితే గతంలో బాధపడే దాన్ని అని సమంత తెలిపింది. కానీ నాగచైతన్యని చూసాక తనలో మార్పు వచ్చిందని సమంత తెలిపింది. ఇప్పుడు తాను విజయం, పరాజయం రెండింటిని ఒకేలా చూస్తున్నానని సమంత తెలిపింది.