Don't Miss!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానంటున్న: సమంత
'ఏ మాయ చేసావె' సినిమాలో తన మేజిక్ బ్యుటీతో కుర్రాళ్లను మాయ చేసి, తన అభిమానులుగా చేసుకున్న సమంతా, ఇప్పుడు డబ్బింగ్ మీద కూడా దృష్టి పెడుతోందట. తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని కృషి చేస్తోంది. ఇందుకోసం, ముందు తెలుగు భాష మీద పట్టు సంపాదించుకుంటున్నట్టు చెబుతోంది. ట్యూటర్ని పెట్టుకుని ట్రైనింగ్ కూడా తీసుకుంటోందట. 'మనకు మనం డబ్బింగ్ చెప్పుకుంటేనే పాత్రకు హండ్రడ్ పర్శేంట్ న్యాయం చేసిన వాళ్లం అవుతాం. అందుకని డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను" అంటోంది సమంతా.
అన్నట్టు, నిన్న ప్రకటించిన నంది అవార్డులలో 'ఏ మాయ చేసావె' సినిమాలోని తన అభినయానికి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చినందుకు సమంతా చాలా హ్యాపీగా వుంది. అయితే, సినిమా చేస్తున్నప్పుడు మాత్రం అవార్డుల గురించీ, అభినందనల గురించీ అస్సలు ఆలోచించలేదనీ, జెస్సీ పాత్రకు న్యాయం చేకూర్చి, గౌతం మీనన్ తన మీదుంచిన నమ్మకాన్ని ఎలా నిలబెట్టాలన్నదే ఆలోచించాననీ చెబుతోంది. మొత్తం మీద గౌతమ్ మీనన్ వలన అవార్డు వచ్చిందని, ఈ క్రెడిట్ ఆయకే దక్కుతుందని సమంతా అంటున్నారు. స్పెషల్ జ్యూరి నంది అవాడ్డు తనకు చాల స్పెషల్ గా ఉందని సమంతా మురిసిపోతుంది.