శ్రీను వైట్ల అంతుచూస్తా అన్నాడు.. నేనే ఉంటేనా! 'సరిలేరు నీకెవ్వరు' డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'ఆగడు' మూవీ అనుకున్న రీతిలో ఆకట్టుకోకపోగా, అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ శ్రీను వైట్ల తనను.. నీ అంతుచూస్తా అన్నాడని చెప్పాడు 'సరిలేరు నీకెవ్వరు' డైరెక్టర్ అనిల్ రావిపూడి. అలా ఎందుకు అన్నాడనే విషయం కూడా చెప్పాడు అనిల్. ఆ వివరాలు చూద్దామా..

మహేష్ 'ఆగడు'.. అనిల్ రావిపూడి
2014 సంవత్సరం మహేష్ బాబు కెరీర్ పీక్ స్టేజ్ లోకి వెళ్తున్న సమయంలో 'ఆగడు' సినిమా విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మహేష్ అభిమానుల ఆశలను తలక్రిందులు చేసింది. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా.. అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రైటింగ్లో భాగమయ్యాడు.

ఆగడు సినిమా ఫ్లాప్.. అనిల్ రావిపూడి కామెంట్స్
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వీడియో ద్వారా జనం ముందుకొచ్చిన అనిల్ రావిపూడి.. ఆగడు సినిమా ఫ్లాప్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. ఆగడు సెకండాఫ్ స్క్రిప్ట్ రాస్తున్న సమయంలోనే.. తాను పటాస్ సినిమాతో బిజీగా ఉన్నానని, ఆ కారణంగా కొన్ని విషయాలు శ్రీను వైట్లతో డిస్కస్ చేద్దామనుకున్నా ఆ సమయం దొరకలేదని అన్నాడు అనిల్.

వెళ్లిపోయావ్గా.. నీ అంతు చూస్తా అన్నాడు
అదే సమయంలో నా 'పటాస్' సినిమా స్టార్ట్ కావడంతో తాను అటే వెళ్లిపోవడం జరిగిందని చెప్పాడు అనిల్. దీంతో ఇప్పటికీ శ్రీను వైట్ల గారు తనతో అప్పుడప్పుడూ ''ఏమయ్యా నాతో సెకండ్ హాఫ్ కూర్చోకుండా వెళ్లిపోయావ్ నీ అంతు చూస్తా'' అని అంటుంటారని అనిల్ చెప్పాడు. ఈ విషయంలో తనకు బాధగానే ఉందని, తాను శ్రీను వైట్ల గారి కోసం కాస్త సమయం కేటాయించి ఉంటే ‘ఆగడు' మంచి హిట్ అయ్యేదని అనిల్ పేర్కొన్నాడు అనిల్ రావిపూడి.
Recommended Video

మహేష్, అనిల్.. 'సరిలేరు నీకెవ్వరు'
ప్రస్తుతం అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. కలర్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. విజయశాంతి కీలకపాత్ర పోషించింది.


Click it and Unblock the Notifications











