Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అనుష్క- కోహ్లీ వివాదం...షాహిద్ కపూర్ కామెంట్
హైదరాబాద్: ఆ మధ్య ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లీకి తోడుగా అనుష్క శర్మ కూడా వెళ్ళడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఫెయిల్యూర్కు విరాట్ కోహ్లి-అనుష్క శర్మ ప్రేమ వ్యవహారాన్ని పావుగా వాడుకుంది బిసీసీఐ అనే విమర్శలకు వచ్చాయి. ఈ వ్యవహారం కాస్తా గర్ల్ ఫ్రెండ్స్, భార్యలు వెంట రావడం వల్లనే టీం ఫెయిల్యూర్ అయిందనే వాదనకు దారి తీసింది.
ఈ మొత్తం వ్యవహారంలో అనుష్క శర్మ, కోహ్లిలను బ్లేమ్ అయ్యారు. త్వరలో వారు పెళ్లి చేసుకుంటారని చెప్పడం వల్లనే వారిని అనుమతించామని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటగాళ్లతో గర్ల్ ప్రెండ్స్ను అనుమతించబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఇలా చేయడం ద్వారా టీం ఫెయిల్యూర్ వెనక ఏదో కొత్త కారణాన్ని చూపే ప్రయత్నం చేసింది బీసీసీఐ.
అయితే బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్....బీసీసీఐ వ్యవహారాన్ని తప్పుబట్టాడు. ఎవరు ఎవరినైనా కలిసే హక్కు ఉంటుంది. బీసీసీఐ వ్యవహారాన్ని తాను అస్సలు సపోర్టు చేయను. కోహ్లి, అనుష్క విషయంలో బీసీసీఐ అనవసర రాద్దాంతం చేస్తోంది. అయితే గర్ల్ ఫ్రెండ్స్, వైఫ్స్ వెంట రావడం వల్ల ప్లేయర్స్ ఫెయిల్ అవుతున్నారనడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించాడు షాహిద్.
ఎవరి పర్సనల్ లైఫ్ వారికి ఉంటుంది....బీసీసీఐ క్రికెటర్ల పర్సనల్ లైఫ్ గురించి నానా యాగీ చేయడం సరైంది కాదు. ఈ విషయంలో తన పూర్తి మద్దతు కోహ్లి, అనుష్కలకే ఉంటుందని షాహిద్ వ్యాఖ్యానించారు.