Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జూ ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ హిట్ ‘శక్తి’ తోనే మొదలు....
జూ ఎన్టీఆర్ తో వైజయంతీ మూబీస్ బ్యానర్ పై 'కంత్రీ" దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'శక్తి" చిత్రం ముందుగా అనుకున్నట్టు సంక్రాంతికి రావట్లేదని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకానుంది. గత సంక్రాంతికి 'అదుర్స్" అనిపించుకున్న జూనియర్ ఈ సంక్రాంతికి కూడా 'శక్తి" చూపిస్తాడని ఆశించగా, అప్పటికి ఈ చిత్రం పని పూర్తి కాదని తేలింది. బడ్జెట్ లిమిట్ లేకుండా నిర్మిస్తున్న చిత్రమిదని అశ్వనీదత్ ఘనంగా ప్రకటించుకున్న 'శక్తి" చిత్రం ఆయన అన్నట్టుగానే భారీ లెవల్లో తెరకెక్కుతోంది.
'కంత్రీ", 'బిల్లా" సినిమాలతో కమర్షియల్ గా సేలబుల్ సినిమాలు తీసే దర్శకుడనిపించుకున్న మెహర్ రమేష్ 'శక్తి" చిత్రంతో బిగ్ లీగ్ లోకి చేరతాడని అశ్వనీదత్ గట్టిగా చెబుతున్నారు. తన బ్యానర్ లోనే టాప్ హిట్ గా నిలిచే లక్షణాలు ఈ చిత్రంలో చాలా కనిపిస్తున్నాయని, 'శక్తి" తో జూ ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తాడని ఆయన అంటున్నారు. ఇలియానా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి వైజయంతి ఆస్థాన సంగీతకారుడు మణిశర్మ స్వరాలందిస్తున్నారు. ఇటీవలి కాలంలో మినిమం గ్యారెంటీ హీరోగా మారిన జూ ఎన్టీఆర్ నుంచి చాలా కాలంగా ఎదురు చూస్తోన్న బ్లాక్ బస్టర్ హిట్ 'శక్తి" తోనే సాధ్యమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.