Don't Miss!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అదిరే కాంబినేషన్: శర్వానంద్-సాయి పల్లవి... దర్శకుడు ఎవరంటే?
Recommended Video
2017 సంవత్సరంలో శతమానం భవతి, మహానుభావుడు సినిమాలతో వరుస విజయాలు అందుకున్న శర్వానంద్... 'ఫిదా', 'ఎంసీఏ' సినిమాలతో తెలుగులో సూపర్ హిట్ జర్నీ ప్రారంభించిన సాయి పల్లవి కాంబినేషన్లో సినిమా ఖరారైంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బేనర్లో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మేరకు గురువారం ఈ సంస్థ నుండి అఫీషియల్ ప్రకటన విడుదలైంది.
దర్శకుడు ఎవరంటే..?
శర్వానంద్, సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్క నున్న ఈ చిత్రానికి ‘అందాల రాక్షసి', ‘కృష్ణగాడి వీరప్రేమగాథ',‘లై' చిత్రాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నారు.
రొమాంటిక్ లవ్ స్టోరీ
దర్శకుడు హను రాఘవపూడి రొమాంటిక్ అవ్ స్టోరీలు తెరకెక్కించడంలో ఎక్స్పర్ట్. శర్వానంద్-సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కించే చిత్రాన్ని వినోదాత్మక ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
షూటింగ్ ఎప్పుడు మొదలు?
ఈ చిత్రం షూటింగ్ జనవరి 3వ వారంలో ప్లాన్ చేస్తున్నారు. ముందుకు అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాను పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ...
నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ... ముగ్గురు టాలెంటెడ్ స్టార్లతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. తెలుగులో ఇదో హంచి హిల్లేరియస్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా నిలుస్తుంది. జనవరి మూడో వారంలో షూటింగ్ మొదలు పెట్టి, వచ్చే వర్షాకాలం నాఠికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం... అన్నారు.