స్విట్జర్లాండ్లో ప్లూజ్వరం బారినపడ్డ శృతి హాసన్
హైదరాబాద్ : హీరోయిన్ శృతి హాసన్ రేసుగుర్రం షూటింగులో భాగంగా స్విట్జర్లాండ్ వెళ్లి ప్లూజ్వరం బారిన పడింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఎంతో అందమైన స్విట్జర్లాండ్ లాంటి ప్రదేశంలో జ్వరం బారిన పడిన కారణంగా ఇక్కడి పకృతి అందాలను పూర్తిగా ఆస్వాదించలేక పోతున్నాను అనే అసంతృప్తి ఆమె వ్యాఖ్యల్లో వ్యక్తమైంది.
అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'రేసుగుర్రం' చిత్రం రూపొందుతోంది. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ మాయ చేసావెకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈచిత్రానికి పని చేస్తున్నారు. ప్రస్తుతం యూరఫ్, జెనీవాల లాంటి ప్రదేశాల్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్న ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
అల్లు అర్జున్ సరసన శృతి హీసన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్యామ్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











