twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖుషి టెక్నీషియన్ కోలా భాస్కర్ కన్నుమూత!!

    |

    2020లో సినిమా పరిశ్రమలో కూడా పలు మరణాలు అందరిని తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. ఒక విషాద ఘటన గురించి మరువక ముందే మరో ఘటనకు సంబంధించిన వార్త కలచి వేస్తోంది. ఈ రోజు ఒక సీనియర్ ఎడిటర్ కూడా కన్నుమూశారు.
    తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా పలు చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన కోలా భాస్కర్ (55) కన్ను మూశారు.

    గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న భాస్కర్ ఈ రోజు ఉదయం 8గంటలకు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాతో పాటు 7జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి సినిమాలకు భాస్కర్ ఎడిటర్ గా వర్క్ చేశారు. ఆ సినిమాలతోనే ఆయనకు సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్నారు. పలు అవార్డులను కూడా అందుకున్నారు.

    South industry popular editor kola bhaskar passes away

    కోలా భాస్కర్ ఏకైక కుమారుడు కోలా బాలకృష్ణ కూడా ఇండస్ట్రీలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 7/G బృందావన కాలనీ దర్శకుడు సెల్వ రాఘవ దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా తెలుగులో 'నన్ను వదలి నీవు పోలేవులే' టైటిల్ తో విడుదల చేశారు కోలా భాస్కర్. ఇక ఆయన మృతిపట్ల కోలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

    English summary
    Many deaths in the film industry in 2020 also caused great distress to everyone. The news of another tragedy is spreading before we forget about one tragic event. A senior editor also passed away today. Kola Bhaskar (55), who has worked as an editor for several films not only in Telugu but also in Tamil, has turned a blind eye.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X