సూపర్బ్.... శ్రీదేవి కూతుళ్లుతో కలిసి...(ఫోటో ఫీచర్)
ముంబై : అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి తాజాగా తన కూతుళ్లుని ఇద్దరినీ తీసుకుని పీపుల్స్ మ్యాగజైన్ లాంచిగ్ ఫంక్షన్ కి హాజరైంది. అక్కడ ఆమె కూతుళిద్దరే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ పీపుల్స్ మ్యాగజైన్ డిసెంబర్ ఇష్యూ కవర్ పేజీపై ఈ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది.
ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి చాలా గ్యాప్ తర్వాత మళ్ళ పబ్లిక్ లో కనపడుతున్నారు. ఆమె ఓపినింగ్స్ కు,లాంచింగ్స్ కు, సినీ పరిశ్రమలోని పంక్షన్స్ కు రెగ్యులర్ గా హాజరవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. దానికి తోడు ఈ పంక్షన్ కి ఆమె తన ఫ్యామిలీతో సహా హాజరవటం ఆమె అభిమానులను సంతోషపరిచింది.
ఇక ఇదే సమయంలో ఆమె పిల్లలను చూసిన వారు.. శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి తెరంగేట్రం చేయబోతుందా? అనే సందేహాలు వెళ్లబుచ్చారు. గత కొంత కాలంగా ఈ విషయమ్మీద బాలీవుడ్లో చర్చలు సాగుతున్నాయి. ఆ విషయాన్ని శ్రీదేవి గతంలో ఖండించారు. ఇప్పుడు మళ్లీ ఇదే విషయంపై ఆమె మాట్లాడారు...ఇంతకీ ఆమె ఏమి అన్నారు... ఫోటోలుతో చూస్తూ..ఎంజాయ్ చేస్తూ చదవండి..

కూతుళ్లు జాహ్నవి,ఖుషి, భర్త బోనీ కపూర్ తో శ్రీదేవి ఖుషీ గా...

నా బంగారాలు అంటోంది శ్రీదేవి..తన ముద్దు బిడ్డలిద్దరనీ చూపుతూ....

మీ పెద్ద అమ్మాయి జాహ్నవి తెరంగేట్రం ఎప్పుడూ? అంటూంటే... శ్రీదేవి..కూల్ గా ...''పిల్లల నిర్ణయానికే నేను అంగీకారం తెలుపుతాను. అన్నింటికంటే చదువు ముఖ్యం. జాహ్నవి, చిన్నమ్మాయి ఖుషి చక్కగా చదువుకొంటున్నారు''

తరిగి జాహ్నవిని అదే ప్రశ్న అడిగితే... ''సినిమాలు, నటన గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. ఓ నిర్ణయం తీసుకొనేదాన్ని కూడా కాదు. ఇంకా చదువుకొంటున్నాను కదా''అంది.

హూ...వచ్చిన పని అయిపోయింది..పీపుల్స్ మ్యాగజైన్ డిసెంబర్ ఇష్యూని లాంచ్ చేసేసారు..

బోనీకపూర్ కి తన రెండో కూతురు ఖుషి అంటే గారాబం ఎక్కువ అనుకుంటా...

మేమిద్దరం అక్క చెళ్ళెలం కాదు... మంచి ప్రెండ్స్ మి ....తెలుసా..

కాబోయే హీరోయిన్స్ తో ఎవర్ గ్రీన్ హీరోయిన్


Click it and Unblock the Notifications











