Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ సినిమాలు రీమేక్ చేస్తే బావుంటుంది : శ్రీదేవి
ముంబై : ఇటీవల బాలీవుడ్లో రీమేక్ల హంగామా ఎక్కువగా కనిపిస్తోంది. మీరు నటించిన చిత్రాల్ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందని శ్రీదేవిని అడిగితే... ''నా చిత్రాల్ని రీమేక్ చేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 'లమ్హే', 'చాందిని' తదితర చిత్రాల్ని రీమేక్ చేస్తే బాగుంటుందని నా సలహా'' అన్నారు. అప్పట్లో 'లమ్హే', 'చాందిని' చిత్రాలు సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ తరంలో రీమేక్ చేస్తే ఎవరు హీరోయిన్ గా చెయ్యాలనేది చర్చ జరుగుతోంది.
పదిహేనేళ్ల తరవాత 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమాతో రెండో ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టారు శ్రీదేవి. దర్శకుడు ఆర్.బల్కి భార్య గౌరీ షిండే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తుండటంతో శ్రీదేవి చాలా ఆనందంగా ఉన్నారు. ఆమె చెబుతూ ''నా అభిమానులు ఇంకా నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. అందుకే 'ఇంగ్లిష్ వింగ్లిష్'కి అంతలా ఆదరణ దక్కింది. భవిష్యత్తులో మంచి కథలతో ఎవరైనా సంప్రదిస్తే... నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాన''ని అన్నారు. ఇక ''నా కూతురు జాహ్నవి వెండి తెరపై ఎప్పుడు కనిపించబోతోందని ఎక్కడికెళ్లినా అందరూ అడుగుతున్నారు. ఆ విషయం గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు''ని శ్రీదేవి తేల్చి చెప్పారు.
ప్రస్తుతం శ్రీదేవి నటించిన హిమ్మత్ వాలా చిత్రం రీమేక్ అవుతోంది. 1981లో విడుదలైన 'ఊరికి మొనగాడు' (కృష్ణ, జయప్రద) సినిమా తెలుగులో తిరుగులేని విజయం సాధించింది. ఇదే సినిమాను జితేంద్ర, శ్రీదేవితో దర్శకేంద్రుడు హిందీలో నిర్మించారు. ఈ సినిమాకు అప్పట్లో కాసుల వర్షం కురిసింది. అదే సినిమాను అజరుదేవగన్తో తిరిగి నిర్మిస్తూ, దక్షిణాదిలో స్థిరపడిన తమన్నాను హీరోయిన్గా ఎంపిక చేశారు. విశేషం ఏమంటే శ్రీదేవి 'హిమ్మత్ వాలా' సినిమాతోనే బాలీవుడ్లో రంగ ప్రవేశం చేసింది.
సినీ ప్రేక్షకులను, పరిశ్రమనూ తన అందం, అభినయంతో మెప్పించి పదేళ్లపాటు పరిశ్రమలో నిలిచిపోయింది. తాజాగా తమన్నా హిమ్మత్ వాలా సినిమాతో శ్రీదేవి స్థాయి ఇమేజ్ను సంపాదించగలదా అనేది సినీ అభిమానుల్లో ఒక చర్చానీయాంశంగా మారింది. అప్పట్లో మ్యూజికల్ హిట్ సాధించిన 'హిమ్మత్వాలా' ఇప్పుడు సాజిద్ఖాన్ దర్శకత్వంలో రీమేక్ అవుతోంది. మరి ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా మెప్పించగలదేమో ఎదురు చూద్దాం అంటున్నారు విమర్శకులు.