Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మొన్నామధ్య ఎన్టీఆర్ కి ఓ పాయింట్ చెప్పా
హైదరాబాద్ :మొన్నామధ్య కలిసి ఓ పాయింట్ చెప్పా. ఆయనకు బాగా నచ్చింది. ఇప్పుడు కథ సిద్ధం చేయాలి అంటున్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. అలాగే చిత్రం త్వరలోనే ఉండబోతుందని వివరించారు. ఇక చిత్రం ఎలా ఉండబోతుందో చెప్తూ...ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నాను. ఆయన ఇమేజ్కు అనుగుణంగా నా శైలిలో వుండే కమర్షియల్ చిత్రమది అని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో చిత్రం అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. వాటిని ఖరారు చేస్తూ సుకుమార్ ఇలా చెప్పుకొచ్చారు.
ఇప్పటికే సుకుమార్ జూ.ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేశారని, జూ.ఎన్టీఆర్ కూడా ఆయన దర్శకత్వంలో చేయడానికి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇప్పటి వరకు యూత్, అండ్ కాలేజీ స్టోరీలతో సినిమాలను రూపొందించిన సుకుమార్....ఎన్టీఆర్తో చేసే సినిమాతో సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని, తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి పూర్తి భిన్నమైన కాన్సెప్టును రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు సుకుమార్ ఓ సినిమాని ఓకే అయినప్పటినుంచి మీడియాలో,ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్రం టైటిల్ ఫైనల్ అయ్యిందని చెప్తున్నారు. వారు చెప్పేదాని ప్రకారం ఈ చిత్రం టైటిల్ 'యంగ్ స్టార్' . 'అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2014 సమ్మర్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది.
ఇక ఈ చిత్రానికి రిలియన్స్ వారు కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహిస్తారు. గత మూడు చిత్రాలుగా బి.వియస్ ఎన్ ప్రసాద్ అశోశియేషన్ లో ఉన్న రిలియన్స్ వారు..ఈ సినిమాతో మళ్లీ తమ అశోశియేషన్ ని ఎక్సటెండ్ చేసారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో బి.వియస్ ఎన్ ప్రసాద్ కుమారుడు బాపినీడు కు ఉన్న స్నేహంతో ఈ ప్రాజెక్టుకి ఇమ్మిడియట్ గా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు. అప్పటివరకూ ప్లాఫ్ లతో లాస్ లలో ఉన్నా 'అత్తారింటికి దారేది' ఘన విజయంతో నిర్మాతగా ఒడ్డున పడ్డారు ప్రసాద్.