Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇధ్దరు క్యాన్సర్తో..., బాధగా ఉంది: సింగర్ సునీత
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాధన్ రెండు రోజుల క్రితం మరణించడం, ఆ వెంటనే ప్రముఖ గాయకుడు రామకృష్ణ కూడా ఈ లోకాన్ని విడిచి వెల్లడం సినీ సంగీత అభిమానులను విషాదంలో ముంచెత్తింది. ఈ ఇద్దరూ లేరనే వార్తను ప్రముఖ గాయని సునీత జీర్ణించుకోలేక పోతున్నారు.
ఈ ఇద్దరు సంగీత ప్రముఖులు వెనువెంటనే మరణించడంపై ఆమె స్పందిస్తూ...ఇద్దరు గొప్ప వ్యక్తులను వెనువెంటనే కోల్పోవడం బాధాకరం. ఇద్దరు కూడబలుక్కుని వెళ్లిపోయారు. ఇద్దరూ గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ వచ్చారు. ఇద్దరూ లేక పోవడం సంగీత ప్రపంచానికి తీరని లోటు అన్నరు.
నేను రామకృష్ణ గారిని చూసి ఏడాది అయింది. అయితే క్యాన్సర్ తో బాధపడుతున్నా ఆయన ఈ విషయాన్ని ఎక్కడా బయటకు రానివ్వలేదు. ఎవర్ని కలవడానికి కూడా ఇష్టపడలేదు. నేను క్యాన్సర్ ను జయించి బయటకు వచ్చి మాత్రమే అందరితో మాట్లాడతాను అన్న వ్యక్తి అప్పుడే వెళ్లి పోవడం బాధాకరం అని సునీత అన్నారు.