Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
సుశాంత్ హీరోగా ‘చి ల సౌ’, దర్శకుడిగా మారిన హీరో రాహుల్ .... (ఫోటోస్)
సుశాంత్ హీరోగా చి ల సౌ మూవీ ప్రారంభం అయింది. ఈ చిత్రానికి హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తారు.
సుశాంత్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా సిరుని సినీ కార్పొరేషన్ బేనర్పై కొత్త చిత్రం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో బుధవారం ప్రారంభమైంది. ఈ చిత్రంతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తేజ్వీర్ నాయుడు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భరత్ కుమార్ మలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి నిర్మాతలు. ముహుర్తపు సన్నివేశానికి అనకాపల్లి ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణక్లాప్ కొట్టగా, మలశాల ధనమ్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... "ఈ సినిమా ద్వారా కొత్త సుశాంత్ ని చూస్తారు. రియల్ లైఫ్లో సుశాంత్ ఎలా ఉంటాడో నాకు తెలుసు. ఈ సినిమాలో తనను అలాగే చూపిస్తున్నాను. టైటిల్ విని ఇది ట్రయంగిల్ లవ్స్టోరీ అనుకోవద్దు. సినిమా చూస్తే తెలుస్తుంది. నాకు స్టోరీ టెల్లింగ్ అంటే ఇష్టం ఉండటంతో దర్శకుడిగా మారాను. హీరోగా కూడా సినిమాలు చేస్తాను. ఈ సినిమా తర్వాత హీరోగా ఓ సినిమా చేయబోతున్నాను`` అన్నారు.
కథ బాగా నచ్చి చేస్తున్నా
హీరో సుశాంత్ మాట్లాడుతూ "కథ బాగా నచ్చి చేస్తున్న సినిమా ఇది, రాహుల్ చాలా అద్భుతంగా ఈ చిత్రం తెరకెక్కిస్తాడాని నమ్మకం ఉంది. చాలా గ్యాప్ తరువాత మంచి లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది`` అన్నారు..
సినిమా అంటే ఉన్న ప్యాషన్ ఉంది
నిర్మాతల్లో ఒకరైన భరత్కుమార్ మలశాల మాట్లాడుతూ - ``సినిమా అంటే ఉన్న ప్యాషన్తో ఈ రంగంలోకి అడుగుపెట్టాం. జశ్వంత్ చెప్పిన ఈ లవ్స్టోరీ బావుంది. కొత్తగా ఉండటంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. రాహుల్గారి మీద నమ్మకం ఉంది, సుశాంత్గారితో సినిమా చేయడం ఆనందంగా ఉంది`` అన్నారు.
టెక్నీషియన్స్
ఈ చిత్రానికి నిర్మాతలు: భరత్ కుమార్ మలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి, కెమెరామెన్: ఎం.సుకుమార్, సంగీతం: ప్రశాంత్ విహారి, ఎడిటర్: చోట కె ప్రసాద్, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయిల గుండ్ల, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ, చీప్ కో డైరెక్టర్: డి. సాయి కృష్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్: రవికుమార్ యండమూరి.