Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సైరా టీజర్కు ముందు చిరు, చెర్రీతో ప్రభాస్.. ముంబైలో ఏం జరిగిందంటే!
తెలుగు సినిమా సత్తా బాలీవుడ్ను తాకింది. గతంలో బాహుబలి సినిమా చరిత్ర తిరుగరాస్తే.. ఇప్పుడు మరోసారి సినీ చరిత్రను లిఖించడానికి సాహో, సైరా సినిమాలు రెడీగా ఉన్నాయి. హిందీ సినీ పరిశ్రమలో హిస్టరీ క్రియేట్ చేయడానికి, ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచడానికి రెడీ అవుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం సాహో హిందీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నిర్మాతలు వంశీ, ప్రమోద్తోపాటు హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ పాల్గొన్నారు. సాహో ట్రైలర్కు అన్ని భాషల్లోనూ విశేష స్పందన వచ్చింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
ఇక సాహో ట్రైలర్ రిలీజ్ తర్వాత మరోసారి టాలీవుడ్ టాలెంట్ బాలీవుడ్ను సర్ప్రైజ్ చేసింది. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని రూపొందించిన సైరా టీజర్ ముంబైలో ఆగస్టు 20న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, సురేందర్ రెడ్డి, తమన్నా, రవి కిషన్, హిందీలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న హీరో ఫర్హాన్ అఖ్తర్ తదితరులు టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు.
సైరా టీజర్కు ముందు అదే హోటల్లో బస చేసిన చిరంజీవి, రాంచరణ్ను ప్రభాస్ కలుసుకొన్నారు. వారి మధ్య కుశల ప్రశ్నలు జరిగాయి. అనంతరం ముగ్గురు తెలుగు సినీ ప్రముఖులు ఫొటోకు ఫోజిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి, ప్రభాస్, రాంచరణ్ ఫోటో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.