బాలకృష్ణ లేకుండా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది.. వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి
కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలమైన సినీ పరిశ్రమకు తిరిగి జీవం పోసేందుకు సినీ పెద్దలందరూ ప్రభత్వాలతో చర్చలు జరుపుతున్నారు. ఓ వైపు సినీ కార్మికులను ఆదుకునేందుకు సీసీసీని స్థాపించగా.. మరోవైపు ప్రభుత్వం కూడా సినీ కార్మికులను నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. అయితే టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల గురించి తనకు తెలియవని, వారంతూ భూములు పంచుకుంటున్నారని బాలకృష్ణ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్గా మారింది.

ప్రభుత్వంతో భేటీ..
సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలు, షూటింగ్లు ప్రారంభం, థియేటర్ల పున: ప్రారంభంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సినీ పెద్దలంతా నడుం బిగించారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, కొరటాల శివ, త్రివిక్రమ్, రాధాకృష్ణ, దిల్ రాజు, సీ కల్యాణ్ లాంటి నిర్మాతలు సీఎం కేసీఆర్, మంత్రి తలసానిని కలిశారు.

బాలయ్య వ్యాఖ్యలు వైరల్..
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య మీడియాతో ముచ్చటించాడు. సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు, అలాగే ముఖ్యమంత్రులతో సినీ ప్రముఖులు సమావేశం అవుతున్న విషయం తనకు తెలియదని, వారంతా భూములు పంచుకోవడానికి సమావేశం అవుతున్నారని కామెంట్స్ చేశాడు.

సీసీసీ భేటీ..
సీసీసీ నేతృత్వంలో మొదటి విడతగా కార్మికులకు సాయం చేశారు. అయితే రెండో విడతలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించేందుకు సీసీసీ మెంబర్స్ అందరూ చిరంజీవి ఇంట్లో సమావేశం అయ్యారు. ఈ చర్చల్లో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ బాలయ్య అంశంపై మీడియాతో మాట్లాడాడు.
Recommended Video

బాలకృష్ణ లేకుండా ఎలా ఉంటుంది..
బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పలానా వాళ్ళను పిలవాలి అనేది లేదు తనను కూడా పిలవలేదని చెప్పుకొచ్చాడు. దాన్ని ఇష్యూ చెయ్యాల్సిన పని లేదని, మహేష్ బాబు, వెంకటేష్ ఇలా చాలా మందిని పిలవలేదని చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం నుంచే ఇనిషియేట్ తీసుకోమని కొందరి పేర్లు చెప్పి ఉంటారని తెలిపాడు. మమ్మల్ని ఎందుకు పిలవలేదు అంటే అర్థం లేదని, బాలయ్య వ్యాఖ్యలు ఆయన పర్సనల్ అని అయినా బాలయ్య లేకుండా ఇండస్ట్రీ ఉంటుందని తాను అనుకోవటం లేదని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











