Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అది కేవలం శంకర్ వల్లే అవుతుంది... 2.0 క్లైమాక్స్ గురించి ఏఆర్ రెహమాన్
సూపర్స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ హై బడ్జెట్ మూవీ 2.0 సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అభిమానులను కాస్త నిరాశ పరిచినా... ఎట్టకేలకు ఈ ఏడాది నవంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రానికి సంగీతం అందించిన ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూలో '2.0' క్లైమాక్స్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. '2.0 చిత్రానికి శంకర్ సరైన వ్యక్తి. ఈ ప్రాజెక్టులో అతడు కాకుండా వేరొకరు ఉంటే విసిగిపోయేవారు. శంకర్ ఐరన్ మ్యాన్ లాంటివాడు. 'నేను ఏ విషయంలో కాంప్రమైజ్ కాను. నాకు క్వాలిటీ కావాలి' అంటూ ఉంటారు. ఈ సినిమాకు సంబంధించి సాంగ్ ఒకటి ఇటీవల 3డిలో చూశాను. ఎలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు. కానీ ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి అద్భుతాలు చేయడం శంకర్కు మాత్రమే సాధ్యం. క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటుంది' అని రెహమాన్ తెలిపారు.
2.0 మూవీ క్లైమాక్స్ అద్భుతంగా..
2.0 మూవీ క్సైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. సినిమా మొత్తానికి క్లైమాక్స్ హైలెట్. ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారు... అని రెహమాన్ తెలిపారు.
రజనీ, అక్షయ్ గురించి...
శంకర్ లాంటి గొప్ప దర్శకుడు దొరకడం, సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ లాంటి స్టార్స్ ఉండటం భారతీయ సినీ ప్రేక్షకుల అదృష్టంగా తాను భావిస్తున్నట్లు రెహమాన్ వ్యాఖ్యానించారు.
భారీ అంచనాలు
2.0 చిత్రాన్ని దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమాకు ఇంత ఖర్చు పెట్టలేదు. తొలిసారిగా ఇంత భారీ మొత్తం ఖర్చు చేసి సినిమా తీశారు. ఇందులో ఎక్కువ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు చేస్తున్నారట. 3డిలో ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వబోతోంది.
గ్రాండ్ రిలీజ్
2.0 మూవీ నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రజనీకాంత్, అమీ జాక్సన్ రోబోలుగా కనిపించబోతున్నారు. అక్షయ్ కుమార్ విలన్ రోల్ సినిమాకు హైలెట్. ఇటు సౌత్ ఇండస్ట్రీతో పాటు అటు నార్త్ ఇండియా ప్రేక్షకలు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.